Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విభేధాలంటూ 'గబ్బర్ సింగ్'పై రూమర్?
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లొకేషన్ లో నిర్మాత,దర్శకుల మధ్య గొడవలు వచ్చాయనే టాక్ అంతటా వినిపిస్తోంది. హైదరాబాద్ కోకాపేట లొకేషన్ లో షూటింగ్ జరిగేటప్పుడు ఈ విభేధాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. అయితే అది రూమర్ అని నిర్మాత గణేష్ అలా నోరు జారే వ్యక్తి కాదని కొందరు అంటున్నారు. ఇద్దరూ గట్టిగా వాదించుకున్నారని,దర్శకుడు హరీష్ శంకర్ చాలా దారుణంగా మాట్లాడి గణేష్ ని రెచ్చగొట్టాడని చెప్పుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని సర్ది చెప్పాడని చెప్పుకుంటున్నారు. ఇక గణేష్,హరీష్ శంకర్ ఇద్దరూ పవన్ కళ్యాణ్ అభిమానులే కావటం విశేషం.పంచ్ డైలాగులతో మిరపకాయ చిత్రం నిలబెట్టిన హరీష్ శంకర్ ఈ చిత్రంలోనూ తన పెన్ పవర్ చూపి ఈ ఇద్దరి కాంబినేషన్ లో అద్బుతమైన కామిడీ వర్కవుట్ చేసాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తోంది.
'గబ్బర్సింగ్'లో ఓ ఢిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించి అలరించనున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'గబ్బర్ సింగ్' చిత్ర ట్రైలర్ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అరోజు పలు కొత్త చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో అదే రోజు ఈ ట్రైలర్లను థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ సూపర్ హిట్ మూవీ 'దబాంగ్' రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో...పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో శృతిహాసన్ నటిస్తోంది. సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.