Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ రెండు సినిమాల మిక్సరే ‘ఊసరవెల్లి’
ఈ నెల ఆరవ తేదీన విడుదల కానున్న ఎన్టీఆర్ 'ఊసరవెల్లి"చిత్రంపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. ఒక ఆది, సింహాద్రి కలిపితే ఒక 'ఊసరవెల్లి" అవుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్స్ చూసిన వారికి సినిమా గురించి ఏ విధమైన క్లూ దొరకక పోయినప్పటికీ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్దమయ్యేలాగ ఉంది. అలాగే ఈ సినిమాకి ఇప్పటికి అతడే ఆమె సైన్యం వంటి మరో రెండు టైటిల్స్ పరిశీలించారు. అలాగే రామ్ తోనూ, రానాతోనూ ఈ చిత్రాన్ని అనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పగను హీరో తన శక్తులన్నీ ఒడ్డి తీరుస్తాడని,గజనీలాంటి గమ్మత్తైన పాయింట్ తో ఈ చిత్రం రెడీ అయిందైని వినపడుతోంది. తమన్నా ఈ చిత్రం జ్ఢాపకశక్తిని కోల్పోయే పాత్రను చోస్తోందని తెలుస్తోంది.
ఊసరవెల్లి చిత్రం మెమరీలాస్ పాయింట్ ని బేస్ చేసుకుని నడవనుందని విస్వసనీయ సమాచారం. ఈ చిత్రంలో తమన్నాకి మెమరీ లాస్ వస్తుందని, అది ఇంటర్వెల్ కి రివిల్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ఆమెను సేవ్ చేసే ఆమెకు చెందిన పగను తీర్చే ప్రేమికుడుగా ఎమోషన్ కలబోసిన పాత్రలో కనిపిస్తాడు. ఇక గత దసరాకి ఎన్టీఆర్ బృందావనం చిత్రం విడుదలై విజయం సాధించటంతో అదే సెంటిమెంట్ తో ఈ చిత్రాన్ని ఆ సమయానికే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఊసరివిల్లి చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంపై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అశోక్ తర్వాత ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కలిపిచేస్తున్న చిత్రం ఇది. కిక్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన సురేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని మరో బ్లాక్ బస్టర్ గా రూపొందిస్తున్నారు.