Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'S/O సత్యమూర్తి' బిజినెస్లో బ్లాక్ మనీ?
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'S/O సత్యమూర్తి' చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్లో వివిధ రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బిజినెస్ వ్యవహారంలో కొంత బ్లాక్ మనీ వైట్ మనీగా మారుతుందని అంటున్నారు.
సినిమా మొత్తం దాదాపు రూ. 45 నుండి 50 కోట్ల ఖర్చుతో తెరకెక్కిందని, రూ. 63 కోట్లకు ఏపి, తెలంగాణ ఏరియాల్లో అమ్ముడయిందని అంటున్నారు. ఇందులో కొంత మేర బ్లాక్ మనీ ఉందంటూ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. త్రివిక్రమ్, బన్నీ గత సినిమాలు రేసుగుర్రం, అత్తారింటికి దారేది భారీగా కలెక్షన్లు సాధించడంతో ఆ లెక్కల ప్రకారం రూ. 63 కోట్ల భారీ మొత్తానికి సినిమాను అమ్మారట.
ఉదాహరణకు....గతంలో రేసుగుర్రం గతంలో ఓ ఏరియాలో దాదాపు రూ. 5.25 కోట్లు వసూలు చేసింది. ఆ లెక్క ప్రకారం ఈ సారి 'S/O సత్యమూర్తి' చిత్రాన్ని రూ. 5.30 కోట్లకు అమ్మారట. అయితే అఫీషియల్ అగ్రిమెంటులో మాత్రం రూ.3.25 కోట్లు అని మాత్రమే ఉంటుందట. మిగిలినదంతా బ్లాక్ మనీ అంటున్నారు. వాస్తవంగా చూసుకుంటే బయ్యర్లు కనీసం రూ. 5.60 వస్తే తప్ప గిట్టుబాటు అవ్వదు. వాస్తవానికి అంత వసూళ్లు రాకున్నా....అగ్రిమెంటులో అంకెల ప్రకారం రూ. 3.25 కోట్లు దాటితే చాలు లాభాలుగా చూపించి వైట్ మనీగా మారుస్తారట. ఫిల్మ్ నగర్లో ఎప్పుడూ ఇలాంటి రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. సినిమా వ్యాపారంలో చాలా వరకు ఇలాంటి మనీనే ఉంటుందని అంటుంటూరు. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
ఇక ఈ సినిమాకు అల్లు అర్జున్, త్రివిక్రమ్ చెరో 10 కోట్లు, దేవిశ్రీ 3 కోట్లు, ప్రసాద్ మూరెళ్ల 2 కోట్లు, సమంత రూ. 1.5 కోట్లు, అదా శర్మ, నిత్యా మీనన్ చెరో 50 లక్షలు, ఉపేంద్ర రూ. 1 కోటి...ఇతర నటీనటులు అలీ, రావురమేస్, కోట, స్నేహ వారి వారి రేంజినబట్టి తీసుకున్నారట.