Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
సాహో టీమ్కి రాజమౌళి సూచన.. ఇలా అయితే కష్టమే అనేశాడట!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ 'సాహో'. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచేలా సాహో టీమ్ ఇస్తున్న అప్డేట్స్ దేనికవే హైలైట్గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాహో టీమ్కి రాజమౌళి ఓ సూచన ఇచ్చారనే వార్త తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ వైరల్ అవుతోంది. ఇంతకీ రాజమౌళి ఇచ్చిన ఆ సూచన ఏంటి? వివరాల్లోకి పోతే..
భారీ బడ్జెట్, హై లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్
భారీ బడ్జెట్ కేటాయించి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సాహో మూవీ రూపొందించబడుతోంది. దేశ విదేశాల్లో ఒళ్ళు గగ్గుర్లు పొడిచే యాక్షన్ సీన్స్ షూట్ చేసిన సాహో టీమ్.. అందుకు తగిన విధంగా విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నారు. మునుపెన్నడూ చూడని రీతిలో ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.
సాహో చూసిన రాజమౌళి.. ఎలా రియాక్ట్ అయ్యాడంటే
ఇటీవలే సాహో సినిమా ట్రైలర్ విడుదలైంది. దీనిపై రాజమౌళి స్పందిస్తాడని అంతా అనుకున్నారు కానీ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం మేరకు ఇప్పటికే రాజమౌళి సాహో సినిమా చూసి కొన్ని సూచనలు కూడా ఇచ్చారని తెలుస్తోంది. సాహో సినిమాను రాజమౌళికి చూపించిన సాహో నిర్మాతలు సలహాలు ఇవ్వమని అడిగారట. దీంతో సాహో రన్ టైమ్ విషయంలో అసంతృత్తి వ్యక్తం చేశాడట జక్కన్న.
సాహో.. కాస్త తగ్గించండి
సాహో సినిమా రన్ టైమ్ 3 గంటల పైనే వచ్చిందట. దీంతో ఈ రన్ టైమ్ తగదని కాస్త తగ్గించుకోవాలని రాజమౌళి సూచించారట. సాహో సినిమా మొత్తం చూసిన ఆయన.. కొన్ని అనవసరమైన సన్నివేశాల్ని తొలగించమని నిర్మాతలకు చెప్పాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. జక్కన్న సూచన మేరకు ఓ 20 నిమిషాల పార్ట్ కట్ చేసేందుకు సిద్దమయ్యారట యూనిట్ సభ్యులు.
ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక
సాహో ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఈ ఆదివారం (ఆగస్టు 18) సాయంత్రం 5 నుంచి ఎంతో అట్టహాసంగా జరగనుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. గతంలో బాహుబలి సినిమాకు నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకను మించి సాహో వేడుక జరగనుందని అంటున్నారు.
సాహో మూవీ
యూవీ క్రియేషన్స్ బ్యానర్పై 350 కోట్ల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.