Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్లాన్ మార్చిన సాహో డైరెక్టర్.. ఆ బాలీవుడ్ హీరోతో నెక్స్ట్ మూవీ..
సాహో సినిమాతో అంచనాలను అందుకోలేకపోయిన యువ దర్శకుడు సుజిత్ గత కొంత కాలంగా తన మూడవ ప్రాజెక్టును సెట్స్ పైకి తేవడానికి చాలానే కష్టపడుతున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో మొదటి హిట్ అందుకున్న తరువాత ప్రభాస్ పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. ఇక మూడవ సినిమా కోసం సుజిత్ ఇప్పుడు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇటీవల బాలీవుడ్ హీరోలపై కూడా ఫోకస్ పెట్టినట్లు టాక్.
సాహో వచ్చి ఏడాది దాటినా..
దర్శకుడు సుజిత్ తీసిన సాహో సినిమా బాలీవుడ్ లో అయితే ఒక మోస్తరుగా మంచి రెస్పాన్స్ అందుకుందనే చెప్పాలి. అక్కడ ఓపెనింగ్స్ కూడా గట్టిగానే వచ్చాయి. అయితే సుజిత్ ఆ వెంటనే యూవీ క్రియేషన్స్ లోనే మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ అది వర్కౌట్ కాలేదు. వేరే ప్రొడక్షన్ నుంచి ఆఫర్స్ కూడా వచ్చయట. కానీ ఎందుకో సాహో విసుదలై ఏడాది దాటినా మరో సినిమాను సెట్స్ పైకి తేలేదు.
మెగాస్టార్ తో ఆఫర్ వచ్చినట్లే వచ్చి..
ఇక మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ కు ఆల్ మోస్ట్ డైరెక్టర్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. అయితే స్క్రిప్ట్ రెడీ చేసిన విధానం మెగాస్టార్ అంచనాలకు అందుకోలేకపోయిందట. ఇక చివరికి న్యాయం చేయలేక సుజిత్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ఆ తరువాత పెళ్లి చేసుకున్న సుజిత్ మళ్ళీ కొత్త తరహా స్టోరీని రెడీ చేసుకున్నట్లు చెప్పాడు.
గోపిచంద్ తో కూడా..
గోపీచంద్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. యూవీ క్రియేషన్స్ లో ఇదివరకే గోపిచంద్ జిల్ సినిమా చేశాడు. ఆ ప్రాజెక్టు తెరకెక్కడానికి కారణం ప్రభాస్. ఇక ఇప్పుడు సుజిత్, గోపీచంద్ కాంబోను మరోసారి కలిపినట్లు టాక్ వచ్చింది. కానీ సుజిత్ ఏమో ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి.
మూడవ సినిమా యూరి హీరోతో..
యూరి సినిమాతో ఇటు టాలీవుడ్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసిన కథానాయకుడు విక్కీ కౌషల్ తో సుజిత్ సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. స్క్రిప్ట్ పై ఇటీవల చర్చలు జరిపినట్లు సమాచారం. సాహో బాలీవుడ్ లో మంచి హిట్ టాక్ ను అందుకుందని సుజిత్ అటు వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తన లెవెల్ ని మరో స్థాయికి పెంచుకోవాలని అడుగులు వేస్తున్నాడట. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.