Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్ షాకింగ్ డెసిషన్: ‘సాహో’పై ఈ ఏడాది ఆశలు వదులుకోవాల్సిందేనా?
బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయి హీరో అయ్యాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చే సినిమాపై అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగిన విధంగానే రూ. 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రాన్ని తన తర్వాతి సినిమాగా ఎంచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. అయితే సాహో సినిమాకు సంబంధించిన తాజాగా ఓ షాకింగ్ విషయం ప్రచారంలోకి వచ్చింది.
‘సాహో' సినిమా ఈ ఏడాది రావడం లేదా?
‘సాహో' చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదంటూ... తాజాగా ఫిల్మ్ నగర్లో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది. ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి విడుదల చేయాలని ప్రభాస్, యూవి క్రియేషన్స్ వారు డిసైడ్ అయినట్లు టాక్.
ఎందుకు ఆలస్యం?
‘సాహో' సినిమా వచ్చే ఏడాదికి వాయిదా వేయడానికి కారణం.... అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాక పోవడమేనంట. విదేశాల్లో అనుకున్న సమయానికి అనుమతులు దొరకక పోవడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోందని, దీంతో పాటు భారీగా గ్రాఫిక్స్ వర్క్ కూడా పెండింగులో ఉందని, ఇదంతా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని.....సినిమా పూర్తిగా సిద్ధమవ్వడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుందని, అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను వాయిదా వేసినట్లు టాక్.
సాహో కంటే ముందు ప్రభాస్ నుండి మరో మూవీ?
‘సాహో' ఆలస్యం నేపథ్యంలో అభిమానులు నిరాశ పడకుండా ఉండటానికి ఈ గ్యాపులో ప్రభాస్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. సాహో కంటే ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
రాధాకృష్ణ దర్శకత్వంలో
‘జిల్' చిత్ర ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా ‘యూవి క్రియేషన్స్' వారే నిర్మించబోతుండటం విశేషం. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుండి మొదలు పెట్టి ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయబోతున్నారట.