Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మెగా హీరోను అభిమానులు పట్టించుకోవడం లేదా?
చిరంజీవి కుటుంబం నుంచి వెండి తెరకు పరిచయం కావడానికి సిద్దంగా ఉన్న హీరో సాయి ధరమ్ తేజ. చిరంజీవి మేనల్లుడయిన సాయి ధరమ్ తేజ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో 'రేయ్" సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. సాధారణంగా మెగా కుటుంబం నుంచి వచ్చే ఏ హీరోపై అయినా అభిమానులు చాలా ఆసక్తి, అభిమానం చూపుతుంటారు. వారితో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి, ఆటో గ్రాఫ్ తీసుకోవడానికి ఎగబడుతూ ఉంటారు. అయితే సాయి ధరమ్ తేజ విషయంలో మాత్రం ఆ హైప్ కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పంజా ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యాడు సాయిధరమ్ తేజ. అయితే మెగా అభిమానులు ఆయన ఎవరో తెలియనట్లే ప్రవర్తించారు.
సాయి ధరమ్ తేజ ఈ మధ్య ఎక్కడా ఎక్స్ ఫోజ్ కావడం లేదు. అందువల్లనే మెగా అభిమానులు ఆయన్ను గుర్తు పట్టలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు రేయ్ సినిమా విడుదలపై కూడా అభిమానులు ఆసక్తి చూపక పోతే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది. అటు చిరంజీవి కూడా మేనల్లుడిని పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేయ్ సినిమా విడుదలై ఆ సినిమా విజయవంతం అయ్యే రేంజ్లో కథ, కథనం పవర్ ఫుల్ గా ఉంటే తప్ప సాయి ధరమ్ తేజకు సినిమా లైఫ్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి ఏం జరుగబోతోందో? రేయ్ సినిమా విడుదలైతే గానీ తెలియదు.