Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
మెగా మేనల్లుడి సామాజిక కోణం.. సక్సెస్ అయ్యేనా..?
వరుస పరాజయాలతో సతమతమవుతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే 'చిత్రలహరి' సినిమాతో కాస్త రిలాక్స్ అయ్యాడు. ఈ సినిమా ఆశించిన మేర కాకపోయినా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో ఉపిరి పీల్చుకున్నాడు. ఇక నుంచైనా సరైన కథాంశాలను ఎంచుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకోవాలని భావించిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మెగాస్టార్ చిరంజీవి పరిశీలించి ఓకే చేయడం విశేషం.
అయితే మారుతి సినిమాతో పాటు తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు సాయిధరమ్ తేజ్. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయబోతున్నాడని తెలిసింది. దర్శకుడు దేవాకట్టా సామాజిక కోణంలో రెడీ చేసుకున్న స్క్రిప్ట్ చూసి సాయి ధరమ్ తేజ్ వెంటనే ఓకే చెప్పేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సోషల్ మెస్సేజ్ ఇవ్వాలని సాయి ధరమ్ తేజ్ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. టైటిల్ అనౌన్స్ చేశాకే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.
అయితే సామజిక కోణంలోని కథాంశం మెగా మేనల్లుడికి నప్పుతుందా? లేదా? అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. డైరెక్టర్ దేవా కట్టా గతంలో ప్రస్థానం సినిమా ద్వారా తన టాలెంట్ బయటపెట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ చిత్రాలు ఆయనకు నిరాశే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో ఇటు సాయిధరమ్ తేజ్, అటు దేవా కట్టా ఇద్దరికీ ఈ సినిమా ఎంతో కీలకం. కాబట్టి ప్రస్థానం లాంటి పవర్ ఫుల్ స్క్రీన్ ప్లేతో సామాజిక అంశాల్ని ప్రేక్షకుల గుండెల్లో జొప్పిస్తేనే మంచి విజయం సాధించడం సాధ్యపడుతుంది. చూడాలి మరి ఇలాంటి కథాంశం ఈ ఇద్దరికీ ఎలా కలిసొచ్చేనా అనేది.