Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మెగా హీరోకు మళ్ళీ దెబ్బ...టైం బ్యాడ్
హైదరాబాద్ : ఎంతో ఖర్చు పెట్టి భారి బడ్జెట్ తో తెరకెక్కించిన తొలి చిత్రం ఎలాగో విడుదలకు నోచుకోవటం లేదు అని రెండో సినిమాపై దృష్టి పెట్టి స్పీడప్ చేచ్దామనుకుంటే అదీ రివర్స్ గేర్ లో నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ. వైవియస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన రేయ్ చిత్రం విడుదలకు చాల అడ్డంకులు ఉండటంతో అతని రెండో చిత్రాన్ని ట్రాక్ ఎక్కిద్దామని ఆడియో విడుదల తేదీ అక్టోబర్ 18 అని ఫిక్స్ చేసారు. అంతేకాక మెగా ఫ్యామిలీ అంతా వచ్చేటట్లు స్కెచ్ వేసారు. అయితే తుఫాన్ దెబ్బకు ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది. ఆడియో ఫంక్షన్ ని వాయిదా వేసుకోమని చెప్పినట్లు సమాచరం.
వివరాల్లోకి వెళితే...సాయధరమ్ తేజ్, రెజీనా జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై ఎ. ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో బన్ని వాసు, హర్షిత్ రూపొందిస్తున్న చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం'.
నిర్మాతలు మాట్లాడుతూ... జగపతిబాబు తమ సినిమాలోకి రావడంతో భారీ అంచనాలు వచ్చాయని, మంచి కథకు వైవిధ్యమైన కమర్షియల్ స్క్రీన్ప్లేతో దర్శకుడు సినిమాను రూపొందిస్తున్నరని, పాటలను , సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ...''ఏం పిల్లో.. తరవాత కొంత విరామం తీసుకొన్నా. కాకపోతే చాలా కథలు రాసుకొన్నా. నేను బతకడానికైతే విరామం లేకుండా సినిమాలు చేసేవాడిని. కానీ నా స్నేహితులు మంచి కథతో సినిమా తీయమని సూచించారు. అందుకే ఈ ఆలస్యం. మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. '' అన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... ఇది నా రెండో సినిమా ఈ సినిమాకు కళ్యాణ్ మామయ్య నటించిన గబ్బర్ సింగ్ లో విజయవంతం అయిన పిల్లా నువ్వు లేని జీవితం అనే పాట పల్లవిని టైటిల్ గా పెట్టడం సంతోషంగా ఉంది. ఇంత మంచి టీమ్ తో పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు.
ఇతర
పాత్రల్లో
చంద్రమోహన్,
జయప్రకాష్రెడ్డి,
దువ్వాసి
మోహన్,
ప్రభాస్
శ్రీను,
సత్యవాణి,
రఘుబాబు,
రజిత,
జోష్
రవి
తదితరులు
నటిస్తున్న
ఈ
చిత్రానికి
సంగీతం:అనూప్
రూబెన్స్,
పాటలు:
రామజోగయ్య
శాస్ర్తీ,
భాస్కరభట్ల,
సుద్దాల
అశోక్
తేజ,
కెమెరా:
దాశరథి
శివేంద్ర,
ఎడిటింగ్:గౌతమ్రాజు,
మాటలు:డైమండ్
రత్నం,
వేమారెడ్డి,
నిర్మాతలు:
బన్నివాసు,
హర్షిత్,
కథ,
మాటలు,
స్క్రీన్ప్లే,
దర్శకత్వం:
ఎ.ఎస్.రవికుమార్
చౌదరి.