Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కోట్లు ఇస్తామన్నా ఆ హీరోకు సాయి పల్లవి నో చెప్పిందట?
సినిమాల కంటే వివాదాలతోనే సాయి పల్లవి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె గురించి మరో వార్త హాట్ టాపిక్ అయింది. ఓ యంగ్ హీరో సినిమా కోసం ఆమెను సంప్రదించగా నో చెప్పినట్లు సమాచారం. అతడు మరెవరోకాదు... టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.
అల్లుడు శ్రీను సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన శ్రీనివాస్... ఇప్పటి వరకు చేసినవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. సమంత, తమన్నా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్లకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ హీరోతో చేయించారు.
శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం 'సాక్ష్యం' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. దీని తర్వాత ఇతడు మరో సినిమాకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. మరో ప్రాజెక్టు కూడా లైన్లో ఉన్నట్లు సమాచారం.
ఈ యంగ్ హీరో సినిమా కోసం ఇటీవల సాయి పల్లవిని సంప్రదించారట. ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలన్నింటికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. అయితే కథ నచ్చక పోవడంతో ఈ ఆఫర్ తిరస్కరించినట్లు సమాచారం.