Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ హీరోకు, డైరెక్టర్కు నో.. అందుకే వెనకడుగు వేసిన సాయి పల్లవి
సాయి పల్లవి ఓ సినిమాకు ఓకే చెప్పిందంటే దాని రేంజే మారిపోతూ ఉంటుంది. సాయి పల్లవి ఓ పట్టాన ఏ ప్రాజెక్ట్నూ ఒప్పుకోదు. తన పాత్ర బాగుండాలి, కథ బాగుండాలి, ఇలా అన్ని అంశాలను బేరీజు వేసుకుంటుంది. అసలే ఈ రౌడీ బేబీ ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది. ఈమె పాపులార్టితోనే సినిమాలు ఆడే స్థాయికి ఎదిగాయి. ఆమె తెరపై కనిపిస్తే చాలని ఎదురుచూసే అభిమానులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆమెఓ చిత్రానికి నో చెప్పిందంటా. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
విలక్షణ దర్శకుడు తేజ సీత సినిమాతో మళ్లీ బోల్తా కొట్టాడు. కొంత గ్యాప్ తీసుకుని ఓ రెండు ప్రాజెక్ట్లను సెట్ చేసుకున్నాడు. ఒకటి రానాతో మరొకటి గోపిచంద్తో. అయితే గోపీచంద్తో తీయబోయే అలిమేలు సమేత వెంకట రమణ అనే చిత్రానికి సాయి పల్లవిని తీసుకోవాలనే ఆలోచన చేశాడట తేజ. ఈ మేరకు హీరోయిన్తో సంప్రదింపులు జరిపారట. అయితే ఆమె మాత్రం సున్నితంగా ఈ ఆఫర్ను తిరస్కరించిందంటా. అయితే సాయి పల్లవి అలా ఎందుకు చేసిందని గుసగుసలాడుకుంటున్నారని టాక్.
గోపీచంద్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు, తేజ కూడా ఇంచు మించు అదే స్థాయిలో ఉన్నాడు.. ఇక సెట్లో తేజ డామినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సాయి పల్లవి నో చెప్పిందని వినిపిస్తోంది. ఏది ఏమైనా తేజకు మరింత పని పెరిగింది. ఇక మళ్లీ హీరోయిన్ వేట కొనసాగించాల్సిందే. అయితే సాయి పల్లవి మాత్రం ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.