Don't Miss!
- News సీఎం జగన్ ను హతమార్చేందుకే గులకరాయితో దాడి.. షాకింగ్ రిమాండ్ రిపోర్ట్!!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తుపాకీ పట్టిన సాయి పల్లవి.. ఫైరింగ్ చేసేందుకు ప్లాన్! వెలుగులోకి రావడంతో..!
నాచురల్ అందం, నాచురల్ నటనకు కేరాఫ్ అడ్రెస్స్ సాయి పల్లవి. అనతికాలం లోనే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ డమ్ సంపాదించి సౌత్ ఇండియన్ ఆడియన్స్ని ఫిదా చేసింది సాయి పల్లవి. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఏంటి.. సాయి పల్లవిలో ఇంత మ్యాటర్ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలేంటో చూద్దామా..
అనుకోని
అతిథిగా
సాయి
పల్లవి..
నవంబర్
15న
ప్రేక్షకుల
ముందుకు..!
తుపాకీ పట్టిన సాయి పల్లవి.. అతనితో కలిసి
ప్రస్తుతం సాయి పల్లవి 'విరాటపర్వం 1992' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో సాయి పల్లవి పడుతుందని, ఆమె చేసే హంగామా మామూలుగా ఉండదని తెలుస్తోంది.
నక్సలైట్ ఉద్యమంలో హీరోయిన్.. రెండు దశాబ్దాల క్రింద
చిత్రంలో నక్సలైట్ ఉద్యమంలో చేరే జానపద కళాకారిణి పాత్రను సాయి పల్లవి పోషిస్తోందని తెలిసింది. దాదాపు రెండు దశాబ్దాల క్రిందటి పోటిటికల్ బ్యాక్ గ్రౌండ్లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో రానా పోషిస్తున్న పాత్ర ఆయన కెరీర్ లోనే చేప్పుకోదగినదై ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
సాయి పల్లవికి శిక్షణ.. మాజీ నక్సలైట్
'విరాటపర్వం 1992' చిత్రంలో నటించేందుకు గాను సాయి పల్లవి శిక్షణ తీసుకుంటోందట. గన్ ఫైరింగ్, బాంబులు వేయడం లాంటి వాటిలో ఆమెకు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారట మేకర్స్. మాజీ నక్సలైట్ ద్వారా ఈ ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్టు తెలుస్తుండటం విశేషం. సాయి పల్లవి నటనను హైలైట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు.
విరాటపర్వం.. విశేషాలు
'విరాటపర్వం' చిత్రానికి బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో పాటు సుధాకర్ చెరుకూరి సంయుక్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. రానా, సాయి పల్లవి మొదటిసారి జోడీ కడుతున్న ఈ చిత్రం ఇద్దరి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చిత్రయూనిట్ చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.