Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రానా సినిమా నుంచి తప్పుకోలేక.. సాయి పల్లవి షాకింగ్ డెసిషన్
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి - సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని, అలాగే సాయి పల్లవి మావోయిస్టుగా కనిపించబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇది ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్ ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుందని వెల్లడించింది. కానీ, సరైన తేదీని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ప్రస్తుతం రానా విదేశాల్లో ఉన్నాడు. ఆయనకు కిడ్నీకి సంబంధించిన చికిత్స జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ విషయంపై అటు రానా గానీ, ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో అతడు చేయాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. అందులో 'విరాట పర్వం' కూడా ఉంది.
రానా కోసం చూసుకుంటూ ఉంటే మిగిలిన సినిమాల కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేననే కారణంతో సాయి పల్లవి చిత్ర యూనిట్ ముందు ఒక ప్రతిపాదన ఉంచిందట. రానా వచ్చే వరకు తనకు సంబంధించిన షాట్స్ తీసేయాలనేదే దాని సారాంశం అని తెలుస్తోంది. దీనికి చిత్ర బృందం కూడా ఓకే చెప్పేసిందట. దీంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. సాయి పల్లవి ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నాగ చైతన్య సరసన నటించనుంది.