Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
మెగా హీరో షాకింగ్ డెసిషన్.. సినిమాలకు బ్రేక్, కారణం ఇదే!
Recommended Video
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ ఆరంభంలో మెరుపులా దూసుకువచ్చాడు. అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్ పోలికలతో, అదేవిధంగా నటన డాన్స్ లలో ఉత్సాహం కనిపించడంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ వచ్చాడని అంతా అనుకున్నారు. సుప్రీం చిత్రం వరకు తేజు అడుగులు అలాగే పడ్డాయి. ఆ తరువాత కథల ఎంపిక సరిగా లేకపోవడంతో తేజు సినిమాలు వరుసగా పరాజయం చెందుతూ వచ్చాయి. వరుస ఫైల్యూర్స్ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తేజ్ ఐ లవ్ యూ కూడా
వివి వినాయక్ తెరకెక్కించిన ఇంటిలిజెంట్ చిత్రంతో తేజుపై విమర్శలు ఎక్కువయ్యాయి. కథల ఎంపిక విషయంలో పరిణితి ప్రదర్శించాలని సినీ విమర్శలకుల సూచించారు. ఆ తరువాత తొలిసారి చేసిన ప్రేమ కథాచిత్రం తేజ్ ఐ లవ్ యూ కూడా నిరాశనే మిగిల్చింది.
కీలక నిర్ణయం
సాయిధరమ్ తేజ్ వరుస ప్లాపుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని తేజు భావిస్తున్నాడట. ఆలస్యంగా అయినా ఈ సారి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
యూఎస్ పయనం
ఇందులో భాగంగానే తేజు మొదట తన మేకోవర్ మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సరికొత్త లుక్ కోసం తేజు యూఎస్ వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నుంచి అన్ని అంశాలలో విభిన్నత ప్రదర్శించాలనేది తేజు ఆలోచనగా చెబుతున్నారు.
కిషోర్ తిరుమల చిత్రం
సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రంలో భాగంగా కిషోర్ తిరుమల చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రం ఆగస్టు నుంచి మొదలు కావలసి ఉంది. కానీ తేజు తీసుకున్న నిర్ణయం వలన ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్టోబర్ వరకు
తేజు అక్టోబర్ వరకు యుఎస్ లోనే ఉండబోతున్నాడట. తేజు తిరిగి వచ్చాకే నెక్స్ట్ మూవీ పట్టాలెక్కేది. కిషోర్ తిరుమల చిత్రంలో తేజు సరసన రితిక సింగ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించబోతున్నారు.