Don't Miss!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
సమంత, వెంకటేష్ లతో హిందీ రీమేక్?
హైదరాబాద్: వెంకటేష్ తొలి నుంచి రీమేక్ లకు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గా...ఆయన గోపాల గోపాల చిత్రం రీమేక్ చేసిన తర్వాత మరే చిత్రం ఒప్పుకోలేదు. తాజాగా ఆయన అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, అర్బాజ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'పీకూ' చిత్రం రీమేక్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో అర్భాజ్ ఖాన్ పాత్రలో వెంకటేష్ కనిపించే అవకాసం ఉందని, సమంత ని ఆయనకు పెయిర్ గా ఉండబోతోందని అంటున్నారు. మరి అమితాబ్ పాత్రకు ఎవరుని ఎంపిక చేస్తారనే దానిపై సినిమా రీమేక్ ఆధారపడి ఉంటుంది.తెలుగులో మరి అమితాబ్ పాత్ర చేసేటంత ఆల్టర్టేవ్ ఎవరూ ఉన్నారంటారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక 'పీకూ' ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.107 కోట్లు వసూలు చేసింది. దేశంలో రూ. 80 కోట్లు మార్కు అందుకొంది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. తొలి రెండు స్థానాల్లో 'బేబీ' (రూ.95.5 కోట్లు), 'గబ్బర్ ఈజ్ బ్యాక్' (ఠాగూర్ రీమేక్) ...(రూ.80.25 కోట్లు) ఉన్నాయి. కథాప్రాధాన్యమున్న చిత్రం కావడం, మరోవైపు గతవారం సరైన సినిమాలు రాకపోవడంతో 'పీకూ' సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి స్థానంలో నిలిచింది అంటున్నారు బాలీవుడ్ పరిశీలకులు.
క్రితం శుక్రవారం రణబీర్ కపూర్, అనుష్క శర్మ నటించిన 'బోంబే వెల్వెట్' చిత్రం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని తట్టుకుని రెండవ వారంలో కూడా 'పీకూ' స్ట్రాంగ్ గా నిలబడింది. కథాబలంతో స్టార్ ఇమేజ్ బేస్ చేసుకుని సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టడం శుభ పరిణామమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్లో ఈ తరహా చిత్రాలు మరిన్ని రావడానికి పీకూ ప్రోత్సాహం అందించిందని చెప్తున్నారు.
ఇంతకీ ఈ 'పీకూ' ఎవరూ అంటే...
మనకు రెగ్యులర్ గా కనిపించే అమ్మాయే. ఓ చేతిలో ఆఫీసు ఫైళ్లు, మరో చేతిలో ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు... ఇదీ సాయంత్రమైతే పీకూ గెటప్. ఉదయమంతా పని చేసి సాయంత్రమయ్యేసరికి ఇంట్లో పనులు చూడాలి. దిల్లీ మహానగరంలో ఆర్కిటెక్ట్గా పని చేస్తూ తన తండ్రితో జీవిస్తుంటుంది పీకూ. ఎవరినైనా ఎదిరించి అవసరమైతే నాలుగు దెబ్బలేయగల ధైర్యం ఉన్న అమ్మాయి.
తండ్రి భాస్కర్ చౌదరి అలియాస్ బాబా అంటే చాలా ప్రేమ. వయసుపైబడిన తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. బాబా దగ్గరికొచ్చేసరికే అసలు మజా మొదలవుతుంది. ఆయనకు చాదస్తంతోపాటు చెవుడూ ఉంది. ఆ రెండింటితో పీకూను తెగ విసిగిస్తాడు. దీన్ని పీకూ సరదాగా తీసుకొన్నా ఒక్కోసారి నాన్న మీద గయ్యిమంటుంది. అయినా పీకూనే బాబాకి బెస్ట్ డాటర్... బాబానే పీకూకి బెస్ట్ ఫాదర్. అలాంటి వీరిద్దరూ దిల్లీ నుంచి సొంత ప్రాంతం కోల్కతాకు ప్రయాణం కడతారు ఈ సమయంలోనే వీరికి రాణా కలుస్తాడు. అసలీ రాణా ఎవరు? పీకూ, బాబాల ప్రయాణం ఎలా సాగిందో నేడు విడుదలవుతున్న 'పీకూ'లో చూడాలి.
దర్శకుడు సూజిత్ సర్కార్ మాట్లాడుతూ....''తండ్రీ కూతుళ్ల మధ్య బంధాన్ని వివరిస్తూ గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఇదీ ఆ అంశం మీద నడిచే సినిమానే. అయితే కొంచెంసేపు నవ్వించి కాసేపు కంటతడిపెట్టించి... జీవితమంటే ఏంటో చూపించే సినిమా ఇది. పీకూ, బాబాలాంటి వాళ్లు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అలాంటివారి కథే ఈ సినిమా. తండ్రీ కూతుళ్ల బంధాన్ని నా శైలిలో ఆవిష్కరించా'' అన్నారు.
దీపికా మాట్లాడుతూ... చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంలో నేను తమిళ యువతిగా నటించాను. రామ్లీలాలో గుజరాతీ మహిళగా, హ్యాపీ న్యూఇయర్లో మహారాష్ట్ర యువతిగా నటించాను. నాకు గుజరాతీ, మరాఠి భాషలపై కొంత పట్టుంది. అందుకే ఆ సినిమాల సమయంలో భాష నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా చేసినప్పుడు తమిళం నేర్చుకున్నాను. అదే విధంగా పీకూ చిత్రం కోసం బెంగాలీ నేర్చుకుంటున్నాను. కొత్త భాషను నేర్చుకోవడం సవాలులాంటిది. కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా స్థానిక బెంగాలీ వాళ్లతో మాట్లాడటం వల్ల త్వరగా భాషను నేర్చుకోవచ్చు. బెంగాలీ భాషలో పర్ఫెక్షన్ సాధిస్తాననే నమ్మకముంది అని చెప్పింది.
ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ కూడా పొడవాటి జుట్టు, పెద్ద పొట్టతో డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, ఇర్ఫాన్ ఖాన్, మౌసమీ ఛటర్జీ ముఖ్య పాత్రధారులు. 'విక్కీ డోనర్', 'మద్రాస్ కేఫ్' వంటి చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరుగాంచిన సూజిత్ సర్కార్ ఈ చిత్ర దర్శకుడు.