Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సమంత బాలీవుడ్ ఎంట్రీ ఖరారు
హైదరాబాద్: సౌత్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది. ఆమె బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సరసన 'సింగమ్ 2' చిత్రంలో హీరోయిన్గా సైన్ చేసినట్లు సమాచారం.
'సింగం 2' చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించబోతున్నారు. సమంత చేసిన సౌత్ సినిమాలన్నీ మంచి విజయం సాధించడం, ఆమె అందం, అభినయం ఆకట్టుకునే విధంగా ఉండటంతో హీరో అజయ్ దేవగన్ పట్టబట్టి మరీ దర్శకుడితో ఆమెను హీరోయిన్గా సెలక్ట్ చేయించాడట.
ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఆమె చేతిలో ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. సమంత-నాగచైతన్య కాంబినేషన్లో రూపొందిన 'ఆటోనగర్ సూర్య' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
దీంతో పాటు పవన్ కళ్యాణ్ సరసన సరదా, జూనియర్ ఎన్టీఆర్-హరీష్ శంకర్ మూవీలో, వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ తనయుడు శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో, అక్కినేని త్రయంతో రూపొందబోతున్న 'మనం' చిత్రంలో, లింగు స్వామి చిత్రంతో పాటు రభస, మరో చిత్రంలో నటిస్తోంది.'