Don't Miss!
- News AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
‘బాహుబలి’నే లైట్ తీసుకున్నారు.. సమంత సినిమాను ఆదరిస్తారా..?
అక్కినేని సమంత నటించిన చిత్రం 'ఓ బేబి'. ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్గా వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి టాక్తో ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలోనే దాదాపు రూ. 20 కోట్ల గ్రాస్ను సైతం సొంతం చేసుకుంది. ఈ మధ్యలో విడుదలైన ఎన్నో సినిమాలను వెనక్కి నెడుతూ ఫుల్ రన్లో దూసుకుపోతుంది 'ఓ బేబి'.
తెలుగులో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను బాలీవుడ్లోకి రీమేక్ చేయబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని హిందీలోకి తీసుకెళ్లబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు, దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా.. బాలీవుడ్ నటి ఆలియాతో చర్చలు కూడా జరుపుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త ఒకటి చర్చనీయాంశం అవుతోంది.
ఈ సినిమాను చైనాలో విడుదల చేయబోతున్నారనేదే ఆ వార్త సారాంశం. 'ఓ బేబి'ని చూసిన కొందరు డిస్టిబ్యూటర్లు.. ఈ సినిమాను చైనా విడుదల చేయడానికి ముందుకు వచ్చారని ప్రచారం జరుగుతోంది. దీనికి చిత్ర బృందం కూడా ఓకే చెప్పేసిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తయిన వెంటనే సినిమాను చైనాలో విడుదల చేస్తారని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
ఈ క్రమంలోనే కొందరు సరికొత్త అనుమానాలను లేవనెత్తుతున్నారు. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'ని చైనాలో విడుదల చేశారు. అయితే, అక్కడ ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఓ బేబి'ని అక్కడి వారు ఆదరిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.