చెన్నైలో సైలెంట్గా కానిచ్చేస్తున్న సమంత.. బయటకొచ్చిన ఆసక్తికర వార్త
సమంత అక్కినేని.. హీరోయిన్లల్లోకెల్లా ఈ భామ ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ హీరోయిన్ అయినా పెళ్లయ్యాక సినిమాలు తగ్గించడం చూశాం.. కానీ సమంత మాత్రం అందుకు భిన్నంగా వెళ్తోంది. నాగ చైతన్యను వివాహం చేసుకున్నాక అక్కినేని వారింట అడుగుపెట్టిన ఈమె అక్కినేని సినీ వారసురాలిగా జోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సమంతకు సంబందించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆ వార్త ఏంటి? సమంత ఏం చేస్తోంది? వివరాల్లోకి పోతే..

మజిలీ, ఓ బేబీ రూపంలో వరుస హిట్స్
గతేడాది వరుస విజయాలతో దూసుకుపోయిన సామ్.. ఈ ఏడాది కూడా అదే రేంజ్ కొనసాగిస్తోంది. ఇటీవలే భర్తతో కలిసి మజిలీ రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈమె ఆ వెంటనే ఓ బేబీ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తాను మెప్పించగలను అని నిరూపించింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సమంత కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ
ఇకపోతే సమంత టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ ఎప్పుడూ ముందే ఉంటుందనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్ గా ఉండే ఈమె ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కమిట్ అయ్యిందట. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరగటం కారణంగా సమంత ఇటువైపుగా ఆలోచనలు చేస్తోందట.

చెన్నైలో సైలెంట్గా కానిచ్చేస్తూ
అయితే ఈ వెబ్ సిరీస్కి సంబదించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో కొన్ని సీన్స్ కూడా షూట్ చేస్తున్నారట. ఇందులో సమంత పాల్గొంటోందని తెలిసింది. ఈ వెబ్ సిరీస్ ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ వెబ్ సిరీస్ విషయమై సమంత నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైలెంట్గా చెన్నైలో కానిచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు జనం.

ఆయనతో కలిసి షికార్లు
ఇకపోతే సమంత తన కుటుంబం కోసం కూడా ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తుంటుంది. షూటింగ్కి ఏ మాత్రం గ్యాప్ దొరికినా భర్త నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో చెక్కర్లు కొడుతుంటుంది. పైగా అక్కడి విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది సమంత. ఏదేమైనా సామ్ రూటే సపరేటు లెండి!.


Click it and Unblock the Notifications











