Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సమంత ని మళ్లీ మహేష్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు(ఫొటొ)
హైదరాబాద్ : సమంత ఏ క్షణాన... "1 నేనొక్కడినే" పోస్టర్ వివాదంలో వేలు పెట్టిందో...అప్పటినుంచీ ఆమెను వివాదాలు వదలటం లేదు. ముఖ్యంగా మహేష్ అభిమానులు ఆమెపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. తాజాగా ఆమె నటించిన అంజాన్ చిత్రంలోని ఫొటో తో మహేష్ అభిమానులతో వివాదం మొదలైంది. మీరు ఇక్కడ చూస్తున్నది అదే. ఈ ఫోటోని వారు చూపుతూ... వారు సోషల్ మీడియాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ప్రశ్నిస్తున్నారు. నీతులు చెప్పి...నువ్వు చేసింది అదేగా అన్నట్లు ఆ కామెంట్స్ ఉంటున్నాయి. మరి దీనిపై ఏ వివరణ సమంత ఇవ్వబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది.
సమంత, సూర్య కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రేడ్ లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. లింగు స్వామి దర్శకత్వం లో రెడీ అవుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులో సికిందర్ టైటిల్ తో ఈ చిత్రం విడుదల చేసే అవకాసం ఉంది.
లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న యాక్షన్, కమర్షియల్ చిత్రం 'అంజాన్'. సమంత హీరోయిన్. ముంబయి నేపథ్యంలో సాగే ఈ కథలోని ఓ ఐటం సాంగులో హిందీ నటి చిత్రాంగద నటిస్తోంది. 'నవ్వే నా స్పెషాలిటీ.. నేను సిల్క్స్మిత కమ్యూనిటీ..' అంటూ సాగే ఈ పాటను వివేకా రాశారు. ఇటీవలే ముంబయిలో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకోసం రూ.కోటితో సెట్ వేసిందట చిత్ర యూనిట్. ఈ ఒక్క పాట కోసం ఆమె రూ.కోటి పారితోషికం తీసుకున్నట్లు కూడా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.
లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్ డ్రాగన్ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్ సంతోష్శివన్ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.
విద్యుత్ జమ్వాల్, మనోజ్బాజ్పాయ్, వివేక్, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్రాజా సంగీతం సమకూర్చుతున్నారు.
సమంత సినిమా విషయానికొస్తే.....తెలుగులో ఆమె నటించిన 'ఆటో నగర్ సూర్య', చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు మరో రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అంజాన్ సినిమా ఈ సంవత్సరం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.