Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆహాలో అత్యధిక పేమెంట్స్.. సమంత, తమన్నాలకు ఎంత ఇస్తున్నారో తెలుసా?
కరోనా దెబ్బకు ఓటీటీ సంస్థల జాతకమే మారిపోయింది. ఒక్కసారిగా డిజిటల్ మిడియాల వైపు జనాలు ఆసక్తి కనబరచడంతో బిజినెస్ వాల్యూతో పాటు ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా పెరిగింది. ఆడియెన్స్ ఎట్రాక్ట్ అవ్వాలి అంటే టీవీ షోలకు మించిన రేంజ్ లో ఫన్ ఉండాలి. అందుకే అగ్ర తారలను దింపుతున్నారు. ఆహా యాప్ హవా ఈ మధ్య గట్టిగానే పెరిగింది. 5మిలియన్స్ కి పైగా యూజర్లు పేరిగినట్లు తెలుస్తోంది. ఇక సమంత, తమన్నా ఆహా యాప్ పబ్లిసిటీ బాధ్యతను వారి భుజాలపై వేసుకున్నారు.
కొత్తగా ఆలోచిస్తున్న అల్లు అరవింద్
ఓటీటీ ప్రపంచంలో అనేక రకాల సంస్థలు ఎక్కువగా సినిమాలతోనే జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వీలైనంత వరకు పెద్ద సినిమా హక్కులను కొనుగోలు చేసి బిజినెస్ వాల్యును పెంచుకుంటున్నారు. అయితే ఆహా యాప్ విషయంలో మాత్రం అల్లు ఆరవింద్ ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. కేవలం సినిమాలపైనే ఫోకస్ చేయకుండా రియాలిటీ షోలతో హైప్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అది కూడా అగ్ర తారలతో..
రెమ్యునరేషన్ కూడా గట్టిగానే..
అదే విధంగా రెగ్యులర్ వెబ్ సిరీస్ లు కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు. సమంత సామ్ జామ్ తో పాటు తమన్నా లేవంత్ హావర్ వెబ్ సిరీస్ లు జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం వీరి రెమ్యునరేషన్ విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరికి దాదాపు కోటికి పైగానే ఇస్తున్నారట.
సమంత కంటే తమన్నాకే ఎక్కువ
అయితే సమంత కంటే తమన్నాకే ఎక్కువ రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. తమన్నా చేస్తున్న వెబ్ సిరీస్ కు దాదాపు రూ.1.8కోట్ల వరకు అందుతుమనట్లు సమాచారం. ఇక సమంత అన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేసి సామ్ జామ్ అనే టాక్ షోను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆమెకు ఒక కోటి రూపాయల వరకు పారితోషికం అయితే అందుతుందట. ఇది ఒక పది రోజులు మాత్రమే అయ్యి ఉండవచ్చని కూడా టాక్ వస్తోంది.
Recommended Video
రానున్న రోజుల్లో స్టార్ హీరోలు కూడా
హీరోయిన్స్ గానే కాకుండా సమంత, తమన్నా ఓటీటీ ప్రపంచంలో కూడా వారి ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో స్టార్ హీరోలు కూడా ఇలాంటి అడుగులు వేయడానికి రెడీగా ఉన్నారు. ఆహాలో సమంత టాక్ షో అయితే బాగానే క్లిక్కయ్యింది. మొదట విజయ్ దేవరకొండ రాగా ఆ తరువాత రానా, నాగ్ అశ్విన్ గెస్టులుగా వచ్చారు. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూతో రాబోతోంది సమంత.