Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మధు శాలినిని..వద్దన్న సంజయ్ దత్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని తెలుగు సినీ పరిశ్రమ నుంచి రాణా, మంచు లక్ష్మి, మధు శాలిని బాలీవుడ్ మూవీ 'డిపార్టు మెంటు'చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మధుశాలిని ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలో మధు శాలినితో ఓ ఐటం సాంగు కూడా చేయించాలని నిర్ణయించాడు రామ్ గోపాల్ వర్మ. ఆ ఫాటలో సంజయ్ దత్ తో ఆమె నర్తించాల్సి ఉంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ ఐటం సాంగు నుంచి ఆమెను తప్పించారని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సంజయ్ దత్ ఆమెతో ఐటం సాంగు చేయించడంపై సముఖంగా లేడని, మంచి హైప్ ఉన్న సాంగు కాబట్టి మధు శాలిని గ్లామర్ ఆ పాటకు సరిపోదని, ఇందుకోసం కసక్కుమనే బ్రెజిల్ మోడల్ ను తీసుకోవాలని నిర్ణయించాడట. సంజయ్ మాట కాదనలేక వర్మ కూడా అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధరమ్ ఓబెరాయ్, సంజయ్ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రాణా ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, కంగన రనౌత్, రవీనా టండన్, అభిమన్యు సింగ్, మధుశాలిని తదితరులు ఇందులో నటిస్తున్నారు.