Don't Miss!
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రీ రిలీజ్ బిజినెస్లో మహేష్కు ‘సరిలేరు’.. ఏ ఏరియాలో ఎంత అంటే..?
మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఓ రేంజ్లో రచ్చ చేశాయి. భరత్ అనే నేను, మహర్షి లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత రాబోతోన్న ఈ చిత్రంపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మించినట్లు ప్రకటించింది చిత్రయూనిట్.
ఎన్నో ప్రత్యేకతలున్న సరిలేరు..
దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకున్నారు. సరిలేరు చిత్రంలో లెక్చరర్ భారతీ లాంటి శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. కమెడియన్ నుంచి బడా ప్రొడ్యూసర్గా అటు నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ సైతం ఈ చిత్రంలో ఓ అద్భుతమైన పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్త తీసుకున్న చిత్ర యూనిట్ భారీ హంగులతో సరిలేరును తీర్చిదిద్దింది.
విడుదల విషయంలో వీడిన ఉత్కంఠ..
సంక్రాంతి బరిలోకి దిగేందుకు సరిలేరు, అల వైకుంఠపురములో ఫిక్స్ కాగా విడుదల తేదీ విషయంలో మాత్రం గట్టిగానే పోటీ పడ్డాయి. జనవరి 11న సరిలేరు, జనవరి 12 అల వైకుంఠపురములో రావాలని ముందు నిశ్చయించుకున్నా.. మళ్లీ తర్జనభర్జన పడ్డారు. ఎన్నో చర్చల అనంతరం నిన్న సాయంత్రం ఓ నిర్ణయానికి వచ్చారు ఇరు చిత్రాల నిర్మాతలు. మొదట అనుకున్నట్టుగానే విడుదల చేస్తున్నామని, ఎలాంటి మార్పులుండవని ప్రకటించారు.
అవాక్కయ్యేలా ప్రీ రిలీజ్ బిజినెస్..
ఇలా అన్ని చిక్కులు వీడి మొత్తానికి జనవరి 11న బెర్త్ కన్ఫామ్ చేసుకుంది సరిలేరు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు తెలుస్తోంది. ఏరియాల వారిగా ఎక్కడ ఎంతకు పోయిందనే వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కళ్లు చెదిరేలా బిజినెస్ చేసిన సరిలేరు వివరాలు ఓ సారి చూద్దాం..
ఏరియాల వారిగా..
మాస్ అండ్ క్లాస్ హీరో అయిన మహేష్కు నైజాం ఏరియాలో బాగానే పట్టున్న సంగతి తెలిసిందే. ఈ ఏరియాలో దాదాపు 25-26కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. సీడెడ్ 10-12కోట్లు, యూఏ పది కోట్లు, ఈస్ట్ 7.5, వెస్ట్ ఆరు, గుంటూరు 7.2, నెల్లూరు 3.1 ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 కోట్లు చేస్తే.. కర్ణాటకలో 8.3కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1.8కోట్లు, ఓవర్సీస్ 14కోట్లు ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల వరకు పలికినట్టు తెలుస్తోంది. అయితే ఇవన్నీ రికవరీ చేసి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. దాదాపు వంద కోట్లు కొల్లగొట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆ విషయం కాసేపు పక్కన బెడితే నేటి సాయంత్రం సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగబోతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తోన్న ఈ ఈవెంట్లోనే ట్రైలర్ను కూడా విడుదల చేయబోతోన్నారు.