Don't Miss!
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ప్లాన్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రేంజ్ ఎలా ఉండనుందంటే!
మహేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. ఆయన కెరీర్లో 26వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమాపై భారీ హైప్ తీసుకురావడంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ట్రెండింగ్గా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారట మేకర్స్. వివరాల్లోకి పోతే..
మహేష్ బాబు సలహా.. ఇన్సైడ్ టాక్
జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానున్న నేపథ్యంలో జనవరి 5వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. మునుపెన్నడూ ఏ సినిమాకు లేని విధంగా అట్టహాసంగా ఈ ఈవెంట్ నిర్వహించాలని మహేష్ బాబు చెప్పారని ఇన్సైడ్ టాక్. ముఖ్య అతిధిగా కూడా ఓ స్టార్ హీరోను ఆహ్వానించాలని చూస్తున్నారట.
మహేష్ బాబు కెరీర్ లోనే ఘనమైన ఈవెంట్
మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత ఘనంగా జరిగింది 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేసి సందడి చేశారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.
'మహర్షి' సమయంలో అనుకున్నారు కానీ..
ఆ తర్వాత మహేష్ కెరీర్లో 25వ సినిమాగా వచ్చిన 'మహర్షి' సినిమా సమయంలో కూడా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కానీ ఈ ఈవెంట్ 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్ని మించి జరగలేదు. అందుకే ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఈవెంట్ సర్వ హంగులతో చేయాలని భావిస్తున్నారట.
పబ్లిక్ ఈవెంట్.. లక్షలాది అభిమానుల సమక్షంలో
గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు జరుగుతున్నాయట. పబ్లిక్ ఈవెంట్ గా నిర్వహించి లక్షలాది అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగాలని 'సరిలేరు నీకెవ్వరు' సినిమా యూనిట్ భావిస్తోందట. ఈ మేరకు అందుకు తగిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
'సరిలేరు నీకెవ్వరు' మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.