Don't Miss!
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సరిలేరు నీకెవ్వరు రన్ టైమ్..!! పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 26వ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలోనే భారీ హైప్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించిన ఆసక్తికర విషయం బయటపడింది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సరిలేరు నీకెవ్వరు రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ కాకుండా ఉండేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి శ్రద్ద తీసుకుంటున్నారట. ఈ విషయం తెలిసి పర్ఫెక్ట్ టైమ్ అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈ సినిమాపై ఉన్న హైప్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్ల పైనే జరిగింది.
మరోవైపు జనవరి 11న సంక్రాంతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. జనవరి 5వ తేదీన భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారట దర్శకనిర్మాతలు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. తమన్నా ఐటెం సాంగ్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.