Don't Miss!
- News కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి జగపతి బాబు ఔట్?
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కాశ్మీర్లో జరుగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా విజయశాంతి, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ షాకింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి జగపతి బాబు తప్పుకున్నారట. అయితే ఉన్నట్టుండి ఆయన ఈ మూవీ నుంచి తప్పుకోవడానికి కారణం ఏమిటనే విషయం తెలియరాలేదు. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
కాగా... జగపతి బాబు స్థానంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత ఇలాంటి కీలక మార్పులు జరుగడం చర్చనీయాంశం అయింది. త్వరలోనే దీని వెనక ఉన్న మెయిన్ రీజన్ వెల్లడి కానుంది.
'సరిలేరు నీకెవ్వరు' చిత్రం చిత్రం ద్వారా రష్మిక మందన్న తొలిసారి మహేష్ బాబుతో చేసే అవకాశం దక్కించుకున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. హీరో ఫ్రెండ్ తల్లి పాత్రలో విజయశాంతి నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.