Don't Miss!
- News AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మార్చాల్సిందే?: 'సైరా'పై చిరుకు అసంతృప్తి.. స్పెషల్ ఇంట్రెస్ట్తో అతన్ని పిలిచారట..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి'పై ఊహాగానాలకు తెరపడటం లేదు. సినిమా మొదటి షెడ్యూల్పై చిరంజీవి అసంతృప్తితో ఉన్నాడని ఆమధ్య ప్రచారం జరగ్గా.. స్క్రిప్టులో మార్పులు చేయబోతున్నారన్న ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, డైలాగ్స్ విషయంలో చిరంజీవి అంత సంతృప్తిగా లేరట..
ఇంత జరుగుతోందా?: 'సైరా' ఎటు పోతోంది.., మధ్యలో గుణశేఖర్ ఎందుకు!..
విషయమేంటి?:
స్క్రిప్టు విషయంలో అసంతృప్తితో ఉన్న చిరంజీవి.. అర్జెంటుగా అందులో మార్పులు-చేర్పులు చేయాల్సిందిగా దర్శకుడికి సూచించారట. దీంతో వెంటనే రచయితలు పరుచూరి బ్రదర్స్, డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రాను రంగంలోకి దించారట.
'సైరా' ఇన్సైడ్ టాక్: ఇదీ జరుగుతోంది.. అందుకే చిరంజీవి ఆ లుక్?..
చిరంజీవి స్పెషల్ ఇంట్రెస్ట్..:
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. ఆ స్థాయి డైలాగ్స్ సరిగ్గా కుదరలేదట. అందుకే సాయిమాధవ్ను కూర్చోబెట్టి స్పెషల్ ఇంట్రెస్ట్తో చిరంజీవి డైలాగ్స్ రాయించుకుంటున్నారట. ఇక కథ విషయంలో పరుచూరి బ్రదర్స్.. అక్కడక్కడ మార్పులు చేర్పులు మొదలుపెట్టారని తెలుస్తోంది.
రెండో షెడ్యూల్:
ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర యూనిట్.. ఫిబ్రవరి నుంచి రెండో షెడ్యూల్కు వెళ్లనుంది. ఈలోగా స్క్రిప్టును పక్కాగా రెడీ చేసి చిరంజీవితో మరోసారి మాట పడవద్దని భావిస్తున్నాడట దర్శకుడు.
కథపై వివాదం:
స్క్రిప్టు సంగతి పక్కనపెడితే.. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర కూడా వివాదాస్పదమవుతుండటం గమనార్హం. 'సైరా'లో చూపించబోతున్నట్లు ఆయనేమి దేశభక్తుడు కాదని, ఒక దోపిడీ దొంగ అని నెక్కంటి శ్రీనివాసరావు అనే ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు.
ఉయ్యాలవాడపై ఆరోపణలు..:
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక దొంగ అని, దోపిడీదారుడని నెక్కంటి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. తాత నుంచి వారసత్వంగా రావాల్సిన 11 రూపాయలను బ్రిటీష్వాళ్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఇవ్వలేదని.. ఆ కక్షతో దారి దోపిడీకి తెగబడ్డాడని అంటున్నారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు కాదని, అలాంటి వ్యక్తి పట్టుకుని దేశభక్తుడిగా చూపించవద్దని ఆయన వాదిస్తున్నారు.
చిరు గురువుగా అమితాబ్..:
'సైరా'లో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చిరంజీవికి గురువు పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్ సంస్థలో రాంచరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.