Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తెరవెనుక సైరాని నడిపిస్తున్నది అతడే.. రాంచరణ్ కోసం!
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉత్కంఠతో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర భారీ షెడ్యూల్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి యుద్ధ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. తాజగా ఈ చిత్ర బడ్జెట్ గురించి ఆసక్తిరేకెత్తించే వార్త ప్రచారం జరుగుతోంది.
డ్రీమ్ ప్రాజెక్ట్
సైరా నరసింహారెడ్డి చిత్రం మెగాస్టార్ చిరంజీవి కలల చిత్రం చాలా ఏళ్ల క్రితమే ఈ చిత్రాన్ని చేయాలని మెగాస్టార్ భావించాడు. ఇప్పటికి కుదిరింది. తన తండ్రి ఇష్టపడి చేస్తున్న చిత్రం కావడంతో రాంచరణ్ ఖర్చుకు వెనుకాడడం లేదు. చిత్ర యూనిట్ అంచనా వేసిన అంచనా ప్రకారం ఈ చిత్రానికి 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
తెరవెనుక ఉండి
సైరా చిత్రానికి ఎంతైనా ఖర్చు చేసేందుకు రాంచరణ్ సిద్ధంగా ఉన్నాడు. కానీ భారీ బడ్జెట్ కావడంతో ఇండస్ట్రీలోని మరో బడా నిర్మాత డివివి దానయ్య సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ పరంగా దానయ్య రాంచరణ్ కు సాయం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిజినెస్ పూర్తయ్యాక
డివివి దానయ్య ఇచ్చిన మొత్తాన్ని సైరా చిత్ర బిజినెస్ పూర్తికాగానే రాంచరణ్ తిరిగి చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సైరా చిత్రంలో డివివి దానయ్య వాటా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనేది ఓ ప్రచారం.
దానయ్య నిర్మాణంలోనే
ప్రస్తుతం రాంచరణ్ డివివి దానయ్య నిర్మిస్తున్న బోయపాటి చిత్రంలోనే నటిస్తున్నాడు. గతంలో రాంచరణ్ బ్రూస్ లీ చిత్రాన్ని నిర్మించింది కూడా దానయ్యే. రాజమౌళి తెరకెక్కించే మల్టీస్టారర్ చిత్రానికి కూడా దానయ్యే నిర్మాత కావడం విశేషం.