Don't Miss!
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Finance Telecom News: వినియోగదారులకు టెలికాం కంపెనీల వాత.. ముహూర్తం ఫిక్స్..
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
జాతిరత్నాలు సీక్వెల్ ప్లాన్ రెడీ… ఈసారి అక్కడ సెటప్.. !
ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ సాధించింది.. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ జాతిరత్నాలు, రొటీన్ సినిమానే అయినా సరే ఈ సినిమా కోసం ముందు నుంచి సినిమా యూనిట్ చేసిన ప్రచారం, ఆ సమయానికి సరైన సినిమా ఒకటి లేకపోవడం వంటి అనేక కారణాలతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించి స్వప్న సినిమా బ్యానర్ కు మంచి లాభాలు ఆర్జించి పెట్టింది.. కేవలం నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 40 కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టి ఈ ఏడాది టాలీవుడ్ చూసిన అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు.
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా సిద్ధం చేసే పనిలో దర్శక నిర్మాతలు రెడీ అయ్యారని తెలుస్తోంది. నిజానికి ఒక ముగ్గురు స్నేహితులు ఒక పట్టణం నుంచి హైదరాబాద్ కి పొట్టకూటి కోసం వస్తే ఎలా ఉంటుంది ? వారు ఇక్కడికి వచ్చి ఎలాంటి పనులు చేస్తారు ? అనే కోణంలో జాతిరత్నాలు సినిమా నడిచింది. ఇప్పుడు ఇదే ముగ్గురు అమెరికా వెళితే పరిస్థితి ఏమిటి అనే కోణంలో ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా చూస్తే జాతిరత్నాలు సినిమాలో కూడా పెద్ద కథ ఏమీ ఉండదు. లాజిక్స్ వెతికినా సరే ఆ సినిమాలో ఎక్కడా పెద్దగా లాజిక్కులు కనిపించవు.
సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం కామెడీతోనే నడిపించాడు దర్శకుడు. ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం కూడా ఇంతకు మించిన కామెడీతో కథ సిద్ధం చేసుకుంటున్నాడట దర్శకుడు కె.వి అనుదీప్. నవీన్ పోలిశెట్టి కూడా ఈ సినిమా మంచి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాన్ని మేరకు ఈ ఇద్దరూ కలిసి వేరే సినిమా ఒకటి తీయాలని ప్లాన్ లో ఉన్నారట. ఆ సినిమాను కూడా స్వప్న సినిమా వాళ్లే ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా పూర్తయి రిలీజ్ అయ్యాక ఈ సీక్వెల్ పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.