Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సిద్దార్థ్, శర్వాలకు భారీ రెమ్యునరేషన్లు.. హాట్ టాపిక్ గా మారిన మహాసముద్రం!
ఆర్ఎక్స్ 100 అనే బోల్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దర్శకుడు అజయ్ భూపతి. వర్మ దగ్గర శిష్యుడిగా పనిచేసిన ఆయన కిల్లింగ్ వీరప్పన్ సహా రక్త చరిత్ర, రక్త చరిత్ర 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ అనుభవంతో ఆర్ఎక్స్ 100 అనే సినిమాను తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన మహాసముద్రం పేరిట ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో సిద్ధార్థ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు మహాసముద్రం కోసం శర్వానంద్ మరియు సిద్ధార్థ్ యొక్క రెమ్యునరేషన్లు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహమ్మారి కారణంగా తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు చెబుతున్న శర్వానంద్ ఈ ప్రాజెక్ట్ కోసం 5 కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడని అన్నారు. అలాగే తెలుగు అభిమానులలో మంచి క్రేజ్ ఉన్న పొందుతున్న సిద్ధార్థ్కు 3 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారట.
అయితే ఇది నిజమో లేక ఊహాగానాలో తెలియదు కానీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. మహా సముద్రంలో బాలీవుడ్ నటి అదితి రావు హైదరి, మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఓ రా అండ్ రస్టిక్ ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కు కూడా అధిక ప్రాధాన్యత ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో కేజీఎఫ్ 'గరుడ' రామ్ కనిపించనున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'ధనుంజయ్' పాత్ర ఎలా ఉండబోతోందో తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. 'కేజీఎఫ్' సినిమాలో లానే ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నట్టు పోస్టర్ ను బట్టి తెలుస్తోంది.