Don't Miss!
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
రామ్ గోపాల్ వర్మ చిత్రంలో శర్వానంద్
ఇక రామ్ గోపాల్ వర్మ కెరీర్ లో పెద్ద హిట్ గా నమోదై బాలీవుడ్ లో వర్మ స్ధానం సుస్ధిరం చేసిన సత్య చిత్రం సీక్వెల్ అంటే ట్రేడ్ లోనూ అంచనాలూ బాగా ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ,జెడీ చక్రవర్తి కాంబినేషన్ లో రూపొందిన సత్య అప్పట్లో ఓ సంచలనం. ముంబై మాఫియామీద వర్మ తీసన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ ని జాన్ అబ్రహం నిర్మించబోతున్నట్లు సమాచారం.
విక్కీ డోనర్ చిత్రంతో నిర్మాతగా విజయం సాధించిన జాన్ అబ్రహం ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తిగా ఉన్నారు. తన బ్యానర్ పై సీరియస్ సబ్జెక్టులు చేయాలనుకుంటున్నట్లు జాన్ తెలిపారు. అందులో భాగంగానే వర్మ నుంచి విన్న సత్య సీక్వెల్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సత్య సీక్వెల్ లో జెడీ నటిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తెలుగు వెర్షన్ కు గానూ ఎవరు నిర్మిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.