Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కేశినేని నానితో కలిసి శర్వానంద్
హైదరాబాద్: ఈ సంక్రాంతికి 'ఎక్స ప్రెస్ రాజా' అంటూ ప్రేక్షకులకి వినోదం అందించిన హీరో శర్వానంద్. ఈ చిత్రం విజయం తర్వాత అతనికి డిమాండ్ రెట్టింపు అయ్యింది. అయితే శర్వానంద్..మాత్రం విజయవాడ ఎమ్.పి అయిన కేశినేని నాని, ప్రారంబించబోతున్న కొత్త సంస్థలో చేయబోయే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రాన్ని మహేష్ .పి డైరక్ట్ చేయనున్నారు. మహేష్ .పి గతంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన రా..రా..కిృష్ణయ్య సినిమాకు డైరక్టర్ చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు, అయినా ఇతను తెచ్చిన స్క్రిప్టు నచ్చి చాన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నడవనుందని తెలుస్తోంది. గత చిత్రం రారా కృష్ణయ్య..ఓ బాలీవుడ్ చిత్రానికి నకలు గా తయారై వివాదాలని మోసుకు వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటివేమీ లేని విధంగా స్క్రిప్టుని ఓకే చేసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది. ఈమేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.