Don't Miss!
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
కేశినేని నానితో కలిసి శర్వానంద్
హైదరాబాద్: ఈ సంక్రాంతికి 'ఎక్స ప్రెస్ రాజా' అంటూ ప్రేక్షకులకి వినోదం అందించిన హీరో శర్వానంద్. ఈ చిత్రం విజయం తర్వాత అతనికి డిమాండ్ రెట్టింపు అయ్యింది. అయితే శర్వానంద్..మాత్రం విజయవాడ ఎమ్.పి అయిన కేశినేని నాని, ప్రారంబించబోతున్న కొత్త సంస్థలో చేయబోయే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రాన్ని మహేష్ .పి డైరక్ట్ చేయనున్నారు. మహేష్ .పి గతంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన రా..రా..కిృష్ణయ్య సినిమాకు డైరక్టర్ చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు, అయినా ఇతను తెచ్చిన స్క్రిప్టు నచ్చి చాన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నడవనుందని తెలుస్తోంది. గత చిత్రం రారా కృష్ణయ్య..ఓ బాలీవుడ్ చిత్రానికి నకలు గా తయారై వివాదాలని మోసుకు వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటివేమీ లేని విధంగా స్క్రిప్టుని ఓకే చేసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది. ఈమేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.