twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందాలు ప్రదర్శించడంలో అనుష్క, ప్రియమణిల కంటే ముందున్నది నేనా..

    By Nageswara Rao
    |

    వేదం సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయైంది దీక్షాసేథ్. ఈసినిమాలో చాలా క్లాస్ గా, ఓగోప్పింటి అమ్మాయిలా నటించిన తీరు అధ్భుతం అని అనిపించుకుంది. ఆసినిమా ఓరకంగా ఆడినాకాని సినిమాలో చేసిన వాళ్శంతా మంచి పేరుని సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఆసినిమా తర్వాత కూడా మంచి అవకాశాలతో బిజీబిజీగా ఉంటున్న హీరోయిన్ దీక్షాసేథ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతం దీక్షాసేథ్ గోపిచంద్ సరసన వాంటెడ్, రవితేజ సరసన మిరపకాయ్ చిత్రంలో నటిస్తున్నారు.

    ఇపుడు టాలీవుడ్‌లో దీక్షాసేథ్ హవా నడుస్తుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. దానికి కారణం మాస్ రాజా రవితేజ సరసన మిరపకాయ్ చిత్రంలో దీక్షాసేథ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో దీక్ష తన అందాలను అపరిమితంగా ఆరబోసిందని అంటున్నారు. ఈ ప్రదర్శన సినీ పరిశ్రమలో పలువురు పెద్దలను ఆకట్టుకోవడంతో ఆమెను ఆఫర్ల వెల్లువ ముంచెత్తుతోంది సమాచారం. ఇపుడు అగ్రశ్రేణి దర్శకనిర్మాతలు దీక్షను తమ సినిమాల్లో నటింపజేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారట. గోపీచంద్ కూడా ప్రత్యేకంగా దీక్షను తన వాంటెడ్ చిత్రంలో నటింపజేయడానికి ఇదే కారణం.

    అంతేకాకుండా అందాలు ఉన్నది చూపించడానికే కదా అంచూ ఎదురు ప్రశ్న వేస్తుందంట ఈముద్దుగుమ్మ. ఎలాగైతేనేం అందాల ముద్దుగుమ్మలు అనుష్క, ప్రియమణి, తాప్సీ వంటి తారలను వెనక్కి నెట్టి రేసులో ముందుకు వెళుతుందేమో చూద్దాం.

    English summary
    The movie also features Richa Gangopadhyay and Deeksha Seth in the female leads. It is directed by Harish Shankar and produced by Ramesh Pushpala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X