twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫ్ డైరక్టర్ కి ఓదార్పు: నిర్మాతగా శేఖర్ కమ్ముల

    By Srikanya
    |

    హైదరాబాద్ : శేఖర్ కమ్ముల నిర్మాతగా వేరే దర్శకుడుతో ఓ చిత్రం చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ములతో పాటు మధురా శ్రీధర్ సైతం ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోనున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే రామరాజు. ఆయన డైరక్ట్ చేసిన చిత్రం మల్లెల తీరంలో సిరమల్లె పూవు. ఈ సినిమా కొందరు మేధావుల ప్రశంసలు పొందినా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ కొత్త చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది.

    రామరాజు మాట్లాడుతూ... 'మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు'... చాలా చిన్న సినిమా. ఎంత చిన్నదంటే ఓ పెద్ద సినిమా ప్రచారానికి అయ్యే బడ్జెట్‌లో తీసిన సినిమా. కానీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. అయితే ఈ సినిమాని ఓ పేరున్న దర్శకుడో, అనుష్కలాంటి పేరున్న నాయికో చేసి ఉంటే, ఎక్కువ థియేటర్లలో విడుదలై ఉండేదని, అప్పుడు దీని సక్సెస్ రేటే వేరని అంటున్నారు చిత్రదర్శకుడు జీవీ రామరాజు.

    Shekar Kammula, Madhura Sridhar to join hands

    మల్లెల తీరంలో సిరమల్లె పూవు సినిమా కథ మొత్తం లక్ష్మీ(శ్రీ దివ్య) పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పెళ్లి చేసుకున్న భర్తతో సరైన సుఖం లేక, తనకు నచ్చినవాడితో ప్రయాణం పెట్టుకోవాలా వద్దా అనే డైలామోలో ఉండే డైనమిజంతో కథ జరుగుతుంది. లక్ష్మీ చాలా సింపుల్ గా, అందంగా ఉండే ఓ సాంప్రదాయబద్దమైన అమ్మాయి. లక్ష్మీ వాళ్ళ నాన్న(రావు రమేష్) ఓ మంచి సంబంధం వచ్చిందని నీకు ఇష్టమైతే పెళ్లి చేస్తానని చెప్పడంతో మంచి సంబంధం అబ్బాయి కూడా బాగున్నాడు కదా అని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి అయిన తర్వాత తన భర్త తనతో సరిగా ఉండడు. ఎప్పుడూ డబ్బు సంపాదించాలి అనే మూడ్ లోనే ఉంటాడు. ఇంకేమీ ఆలోచించాడు, ఇక దేని గురించి పెద్దగా పట్టించుకోడు.

    భర్త అలా ఉండటం లక్ష్మికి అంతగా ఇష్టం ఉండదు. అదే సమయంలో తనకి సినిమాలకి పాటలు రాసే క్రాంతి(క్రాంతి) పరిచయమవుతాడు. వారిద్దరి పరిచయం కాస్తా మంచి స్నేహంగా మారుతుంది. కానీ కొద్ది రోజులకి లక్ష్మీ తనకి క్రాంతి మీద ఉన్నది స్నేహం కాదు ప్రేమ అని తెలుసు కుంటుంది. లక్ష్మీ ప్రేమని క్రాంతి అంగీకరించాడా? లేదా? అలాగే లక్ష్మీ తనతో సరిగా లేని భర్తని వద్దనుకొని తెగతెంపులు చేసుకొని క్రాంతి దగ్గరికి వెళ్లిపోయిందా? లేక తనతోనే సర్దుకు పోయిందా? అనేది క్లైమాక్స్ తో నడిపించాడు.

    English summary
    Sekhar Kammula and Madhura Sreedhar are teaming up to produce a new-age romantic film. Both the producers have listened and approved the script of director Ramaraju of Mallelatheeram fame and the touching romantic love story set to go on floors soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X