Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లవ్ స్టొరీ కోసం శేఖర్ కమ్ముల మరొ కొత్త ప్లాన్.. మళ్ళీ కరెక్షన్స్ తప్పట్లేదట?
మూడేళ్ళ క్రితం ఫిదా మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ కొట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల నెక్స్ట్ లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఫిదా మూవీ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని దర్శకుడిగా మరింతగా తన రేంజ్ ని పెంచుకున్న శేఖర్ కమ్ముల, ప్రస్తుతం తీస్తున్న లవ్ స్టోరీ మూవీతో మరో భారీ సక్సెస్ కొట్టేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలారోజుల క్రితమే పూర్తి అయింది. ఆ తరువాత రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు సాంగ్స్ అన్ని కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నాగచైతన్య, సాయి పల్లవి తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ లవ్ స్టోరీ మూవీ సాంగ్స్ కి యువత ఎంతగానో ఎట్రాక్ట్ అయ్యింది. ఇక సాంగ్స్ వారిలో సినిమా పై అంచనాలను విపరీతంగా పెంచాయి. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ యూట్యూబ్ లో వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 10న తమ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అంటూ ఎప్పుడో ప్రకటించిన యూనిట్, మధ్యలో సడన్ గా సినిమాని మరొక 20 రోజులు వాయిదా వేసి అందరికీ షాక్ ఇచ్చారు.
దానికి కారణం కరోనా లేదా మరొకటి అయ్యి ఉండవచ్చని చెబుతున్నప్పటికీ మరొక ముఖ్యమైన కారణం ఉన్నట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. మూవీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ తో దర్శకుడు శేఖర్ కమ్ముల కన్విన్స్ కాలేదని, వాటిని మరింత బెటర్ మెంట్ గా తీసేపనిలో ప్రస్తుతం ఆయన ఉన్నారని, అందుకే ప్రస్తుతం ఈ మూవీ సీన్స్ రీషూట్ కోసం ప్రస్తుతం నాగచైతన్య నిజామాబాద్ వెళ్లారని సమాచారం. నిజానికి సీన్స్ సరిగ్గా రాకపోవడం మాత్రమే మూవీ వాయిదా కి సరైన కారణం కాదని, ఇటీవల ఏపీలో మూవీ టికెట్స్ ఇష్యూ కూడా జరుగుతుండడం కూడా వాయిదాకి మరొక కారణంగా చెప్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం చేస్తున్న సీన్స్ రీషూట్ తో సినిమా మరింత అద్భుతంగా సిద్ధం అవుతోందని, తప్పకుండా రిలీజ్ తరువాత లవ్ స్టోరీ మూవీ సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాని ఈనెల 30 లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేసే ఛాన్స్ ఉందని, దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా విడుదల తరువాత ఎంత వరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇక దర్శకుడు శేఖర్ కమ్ముక లవ్ స్టోరి అనంతరం ధనుష్ తో ఒక భారీ పొలిటికల్ డ్రామాను సెట్స్ పైకి తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఓకేసారి హిందీ తమిళ్ తెలుగులో రూపొందనున్న ఆ సినిమా స్క్రిప్ట్ పనులన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. ఇక సినిమా రెగ్యులర్ షూట్ ను ఈ ఏడాది చివరలో స్టార్ట్ చేయనున్నారు.