Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
Mahesh Babu మూవీలో శిల్పా శెట్టి అలా: ఊహించని పాత్రలో సీనియర్ బ్యూటీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతోన్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమా తర్వాత సినిమాను లైన్లో పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తీస్తున్న ఈ చిత్రం.. మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇంకా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అయినప్పటికీ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
మిస్ యూనివర్స్గా మిస్ మెక్సికో ఆండ్రియా.. సత్తా చాటిన భారతీయ అందాల సుందరి
సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ఓ సినిమాను చేయబోతున్నాడు. 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కీలక పాత్రను పోషిస్తున్నట్లు ఓ న్యూస్ రెండు రోజులుగా ప్రచారం అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆమె చేసేది మహేశ్ బాబు పిన్ని క్యారెక్టర్ అని తెలిసింది. ఈ పాత్రను త్రివిక్రమ్ ఎంతో స్టైలిష్గా రూపొందించాడని కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో మాటల మాంత్రికుడు ఎంతో మంది సీనియర్ హీరోయిన్లను తన సినిమాల్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు శిల్పా శెట్టిని తీసుకు రాబోతున్నాడని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దీనికి 'పార్థు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కాబోతుందని అప్పుడే ప్రకటించేశారు.