twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాధే శ్యామ్’ టైటానిక్ మూవీకి కాపీనా: లీకైన టాప్ సీక్రెట్.. ఇందులో ఆ ఎపిసోడ్ హైలైట్ అంటున్నారే!

    |

    రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ నటిస్తోన్న చిత్ర 'రాధే శ్యామ్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. అందుకే దీన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో సినిమా విడుదల కూడా అనుకున్న సమయానికి సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భారీ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

    రొమాంటిక్ చిత్రంలో యంగ్ రెబెల్ స్టార్

    రొమాంటిక్ చిత్రంలో యంగ్ రెబెల్ స్టార్

    కొంత కాలంగా యాక్షన్ మూవీల్లోనే నటిస్తోన్న ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నాడు.

    వరుస ఆటంకాలతో సినిమా ఆలస్యం

    వరుస ఆటంకాలతో సినిమా ఆలస్యం

    గతంలో స్పీడుగా సినిమాలు చేస్తూ వచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. 'బాహుబలి' నుంచి వేగాన్ని తగ్గించాడు. మంచి ఔట్‌పుట్ కోసం సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇదే 'రాధే శ్యామ్' విషయంలోనూ జరుగుతోంది. ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయినా.. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. పలుమార్లు ఆటంకం ఏర్పడడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం అని చెప్పుచ్చు.

    అంచాలకు తగ్గట్లుగానే బిజినెస్ కూడా

    అంచాలకు తగ్గట్లుగానే బిజినెస్ కూడా

    'రాధే శ్యామ్' చిత్రీకరణ ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున విడుదల చేశారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

    బ్యాలెన్స్ ఉన్న షూట్.. ప్రభాస్ వల్లే

    బ్యాలెన్స్ ఉన్న షూట్.. ప్రభాస్ వల్లే

    'రాధే శ్యామ్' మూవీలో కొన్ని బ్యాలెన్స్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. కృష్ణంరాజు, పూజా హెగ్డేతో ప్రభాస్ చేయాల్సిన సన్నివేశాలతో పాటు ఓ గ్రీన్ మ్యాట్ సాంగ్ షూటింగ్ కూడా మిగిలిపోయింది. దాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, ఇంతలో కరోనా ప్రభావం పెరగడంతో వాయిదా వేశారు. ఆ తర్వాత పూజా హెగ్డే కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.

    ‘రాధే శ్యామ్' మూవీ టైటానిక్‌కు కాపీనా

    ‘రాధే శ్యామ్' మూవీ టైటానిక్‌కు కాపీనా

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' పునర్జన్మల నేపథ్యంతో రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా టైటానిక్ మూవీకి కాపీ అంటున్నారు. దీనికి కారణం ఆ సినిమాలో మాదిరిగానే ఇందులో కూడా సముద్రంలో షిప్ యాక్సిడెంట్ జరుగుతుందట.

    ఆ ఎపిసోడ్ మాత్రం హైలైట్ ఉంటుందట

    ఆ ఎపిసోడ్ మాత్రం హైలైట్ ఉంటుందట

    తాజా సమాచారం ప్రకారం.. 'రాధే శ్యామ్' సినిమాలో సముద్ర ప్రయాణానికి సంబంధించిన ఎపిసోడ్ హైలైట్ కాబోతుందట. ఇందులో ఓ భారీ షిప్‌లో హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే ప్రయాణం చేస్తారని తెలిసింది. ఆ సమయంలో ఓ ప్రమాదం జరుగుతుందని.. అదే సినిమా కథను మలుపు తిప్పుతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇది దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందట.

    English summary
    Young Rebel Star Prabhas upcoming film is Radhe Shyam Under Radha Krishna Kumar Direction. In This Movie Ship Episode Highlight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X