Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాలీవుడ్లోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ.. అలాంటి సీన్స్తో ఆ ఇద్దరు టార్గెట్
లక్ష్మీ పార్వతి.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు భార్యగా చాలా మందికి పరిచయమైన మహిళ. ఈమె రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ను రెండోసారి ముఖ్యమంత్రిని చేయడంలో ఈమె పాత్ర ఎంతో కీలకం అని అంటారు. ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అయ్యారు. దీనికి కారణం వాళ్ల కుటుంబంతో పాటు పార్టీలో జరిగిన వ్యవహారాలే. వీటి తర్వాత ఆమె రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. కానీ, కొన్నేళ్ల క్రితం ఆమె ఓ పార్టీలో చేరారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. తాజాగా ఆమె గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా విషయం..? పూర్తి వివరాల్లోకి వెళితే..
రాంగోపాల్ వర్మ ఇంట్రెస్ట్
రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు చిరునామా. తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తుంటాడు ఈ బడా డైరెక్టర్. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసిన ఈయన.. కొద్దిరోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. కొద్దిరోజులుగా ఆయన రాజకీయాలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమా చేశాడు. ఇది లక్ష్మీ పార్వతి పాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఈ పాత్ర వివరాల కోసం వీళ్లిద్దరూ కలిసి ట్రావెల్ చేశారు.
మళ్లీ అదే తరహా సినిమా
రాంగోపాల్ వర్మ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ సినిమాలోని పాటను విడుదల చేసే వరకు ఇది షూటింగ్ జరుపుకుంటున్నట్లు ఎవరికీ తెలియదు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పాటను విడుదల చేస్తానని వర్మ ట్వీట్ చేశాడు. అందులో ‘ద మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని మొదటి పాటను తొమ్మిదో తారీఖు, తొమ్మిది గంటలకు విడుదల చేస్తాను' అని పేర్కొన్నాడు. అంతేకాదు, ఇది వివాదాస్పదం కాదని చంద్రబాబు మీద ఒట్టేసి చెబుతున్నానన్నాడు. దీంతో అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.
ఏదో ఒక బాణం వేస్తూనే ఉన్నాడు
సంచలన దర్శకుడు ఆర్జీవీ చేస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఆయన కొద్ది రోజులుగా ఇస్తున్న అప్డేట్లే. ఇందులో నటించే పాత్రధారులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తున్నాడాయన. ముఖ్యంగా ఓ పార్టీ అధినేతను టార్గెట్ చేసిన వర్మ.. ఆయనపై ఎన్నో బాణాలను సంధిస్తున్నాడు. దీంతో ఆ పార్టీ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదాస్పదం కాదన్నాడు.. కానీ...
రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నాడు. అంటే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దానిపై స్టోరీని అల్లుకున్నాడట ఈ సంచలన దర్శకుడు.
లక్ష్మీ పార్వతి ఎంటర్ అవుతోంది
ఈ సినిమా ద్వారా లక్ష్మీ పార్వతి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన అప్డేట్స్ అన్నీంటిలో ఆయా పాత్రలకు దగ్గరగా పోలికలు ఉన్న వ్యక్తులను తీసుకున్నట్లు కనిపించింది. అయితే, ఇందులో లక్ష్మీ పార్వతి పాత్ర కూడా ఉందట. దీనికి ఎవరినో తీసుకోకుండా ఆమెనే చూపించాలని వర్మ డిసైడ్ అయ్యాడని టాక్.
Recommended Video
ఆ మెసేజ్లు చూపిస్తారట
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో లక్ష్మీ పార్వతికి సంబంధించిన ఓ వివాదం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె ఎవరికో మెసేజ్లు చేసిందని అన్నారు. అయితే, అవన్నీ తప్పని తర్వాత తేలింది. ఈ ఎపిసోడ్నే వర్మ చూపించబోతున్నాడని ఫిలిం నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.