Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బెల్లంకొండ బాలీవుడ్ మూవీపై షాకింగ్ రూమర్.. ప్లాన్ మొత్తం రివర్స్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బిగ్ బడ్జెట్ సినిమాలు తీసే ఏకైక హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సీనియర్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ గణేష్ తనయుడైన శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా భారీ స్థాయిలో విడుదల కావాల్సిందే. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందనే విషయం పక్కన పెడితే బెల్లంకొండ భవిష్యత్తు సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపవని చెప్పవచ్చు.
రాక్షసుడు సినిమా డీసెంట్ గా అలా హిట్టయ్యిందో లేదో ఈ హీరో వెంటనే బాలీవుడ్ వైపు యూ టర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. వివి.వినాయక్ దర్శకత్వంలోనే ఛత్రపతి సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నారు. వినాయక్ కూడా మళ్ళీ తనదైన శైలిలో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అయితే సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా సరైన అప్డేట్ రాలేదు.
హీరోయిన్ దొరకగానే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అందుకోసం బాలీవుడ్ లోని మీడియం రేంజ్ హీరోయిన్స్ ను సంప్రధించగా ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు అనే టాక్ వచ్చింది. ఇక కరోనా దెబ్బతో నిర్మాతలు ఇప్పుడే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను నిర్మించడం కరెక్ట్ కాదని హోల్డ్ లో పెట్టారట.
అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ ఖాళీగా ఉండలేక తమిళ్ మూవీ కర్ణన్ రీమేక్ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఆ సినిమాను తెలుగు అడియెన్స్ ముందు ఉంచాలని అనుకుంటున్నాడట. మరి ఛత్రపతి రీమేక్ ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే కరోనా డోస్ తగ్గే వరకు ఆగాల్సిందే!