Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో పాన్ ఇండియా దర్శకుడితో ప్రభాస్ మూవీ.. ఇప్పట్లో జరిగే పనేనా?
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం సాహో సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుంటాడు అనుకుంటే ఊహించని రిజల్ట్ ని అందుకున్నాడు. నిజానికి ఆ సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేదు. బాలీవుడ్ లో తప్పితే మిగతా భాషల్లో బయ్యర్లకు దారుణమైన నష్టాలను మిగిల్చింది. అయితే ఆ సినిమా రిజల్ట్ పై ప్రభాస్ కి ముందుగానే ఒక అనుమానం అయితే ఉందని అప్పట్లో టాక్ వచ్చింది.
ఆ దెబ్బతో కొన్నాళ్లపాటు బిగ్ బడ్జెట్ సినిమాలకు వీలైనంత వరకు దూరంగానే ఉండాలని అనుకున్నాడు. కానీ సాహో తరువాత రాధేశ్యామ్ ని కూడా 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాల్సి వస్తోంది. చూస్తుంటే సినిమా ఎండ్ అయ్యే వరకు మళ్ళీ బడ్జెట్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమాను బాహుబలి రేంజ్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఆ తరువాత ప్రభాస్ ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ కన్నడ మీడియాలో మాత్రం కొన్ని రూమర్స్ వస్తున్నాయి. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని దృష్టిలో ఉంచుకొని ఒక పాన్ ఇండియా కాన్సెప్ట్ ని అనుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఒక వేళ వీరి కాంబినేషన్ సెట్టయినా కూడా సినిమా రావడానికి మరో నాలుగేళ్లు పట్టవచ్చు. ఎందుకంటే ప్రభాస్ పూర్తి చేయాల్సిన రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే.
అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. వీరి సినిమాలు పూర్తయ్యి రిలీజ్ అయ్యే సరికి మూడేళ్లయినా పడుతుంది. అందుకే ప్రశాంత్, ప్రభాస్ కాంబోలో సినిమా రావాలి అంటే మరో నాలుగేళ్ళ సమయమైన పడుతుంది. ఇక ఈ కాంబినేషన్ నిజంగా సెట్టవుతుందా లేదా అనే విషయం తెలియాలి అంటే మరో ఏడాదైనా వెయిట్ చేయాల్సిందే.