రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి షాకింగ్ న్యూస్!
రాజమౌళి యంగ్ ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డివివిదానయ్య ఈ సినిమాను నిర్మించాబోతున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోందని సమాచారం.
ఈ సినిమా కథ మాత్రం కేవలం ఒక్క రోజులోనే జరిగే కథ అన్నట్లు తెలుస్తోంది. అంటే ఉదయం మొదలయ్యే సినిమా రాత్రి కంతా పూర్తి అవుతుందని సమాచారం. ఒక రోజులో జరిగే కథగా రాజమౌళి ఈ మూవీని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అన్నయ్యగా ఎన్టీఆర్, తమ్ముడిగా చరణ్ కనిపించనున్నారనే వార్తా ప్రచారంలో ఉంది.

విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి సంభందించిన వర్క్ పూర్తి చేసాడంట . ఎన్టీఆర్ - చరణ్లపై ఫోటో షూట్ కూడా పూర్తి అయ్యింది. యాక్షన్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకేక్కబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.


Click it and Unblock the Notifications











