Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి షాకింగ్ న్యూస్!
రాజమౌళి యంగ్ ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డివివిదానయ్య ఈ సినిమాను నిర్మించాబోతున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోందని సమాచారం.
ఈ సినిమా కథ మాత్రం కేవలం ఒక్క రోజులోనే జరిగే కథ అన్నట్లు తెలుస్తోంది. అంటే ఉదయం మొదలయ్యే సినిమా రాత్రి కంతా పూర్తి అవుతుందని సమాచారం. ఒక రోజులో జరిగే కథగా రాజమౌళి ఈ మూవీని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అన్నయ్యగా ఎన్టీఆర్, తమ్ముడిగా చరణ్ కనిపించనున్నారనే వార్తా ప్రచారంలో ఉంది.
విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి సంభందించిన వర్క్ పూర్తి చేసాడంట . ఎన్టీఆర్ - చరణ్లపై ఫోటో షూట్ కూడా పూర్తి అయ్యింది. యాక్షన్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకేక్కబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.