Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి కోసం లాబీయింగ్ కి దిగిన శ్రియ....
స్లిమ్ బ్యూటీ శ్రియకు ఎట్టకేలకు జ్ఝానోదయం అయింది. బాలీవుడ్ అవకాశాల కోసం అర్రులతు చాచేకన్నా, టాలీవుడ్ లో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవడమే బెటర్ అనుకుంటోంది. ఇటీవలే 'డాన్ శీను"లో రవితేజ సరసన నటించి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రియ, పవన్ కళ్యాణ్ పులి లో తన ఒంపు సొంపులతో కుర్రకారును దోచేసింది. అదే రూట్ లో అగ్రహీరోల సరసన నటించేందుకు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.
తనకున్న పాత పరిచయాల్ని తిరిగి కలుపుకుంటూ అందరితో 'టచ్"లో ఉంటోందట. ఇక ఇందులో భాగంగానే శ్రియ ఈ మధ్యన తన ఫేవరెట్ డైరెక్టర్ వివి వినాయక్ ను కలిసిందట. 'ఠాగూర్" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో, బాలకష్ణతో తీసిన చెన్నకేశవ రెడ్డి" లో వినాయక్ శ్రియనే హీరోయిన్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిక చిరంజీవి నటించనున్న 150వ చిత్రాన్ని కూడా వినాయకే దర్శకత్వం వహిస్తున్నాడనే వార్తలు రావడంతో ముందుజాగ్రత్తగా చిరు సరసన హీరోయిన్ గా ఛాన్స్ రాబట్టుకోవాలని శ్రియ లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.