Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
‘రామయ్యా వస్తావయ్య’ లో ఆమె విలనా?
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కధను మలుపు తిప్పే పాత్రను చేస్తోంది. ఈ పాత్ర కథలో ఊహించని ట్విస్ట్ ఇచ్చే నెగిటివ్ షేడ్స్ తో సాగే పాత్ర అంటున్నారు. విశాల్ చిత్రం పొగరు లో శ్రియారెడ్డి పోషించిన తరహా పాత్ర అంటున్నారు. ఉండేది కాసేపే అయినా అదరకొడుతుందని చెప్తున్నారు.
శ్రుతి ఈ చిత్రంలో చేసే పాత్ర సినిమాకు, తన కెరీర్ కు కీలకమై నిలుస్తుందని చెప్తోంది. ఈ సందర్భంగా చాలా ఉద్వేగంతో ఉంది శ్రుతి. ఆ సినిమాలో శ్రుతి పోషించిన పాత్ర పేరు 'అమ్ములు'. జీవితాలను మలుపుతిప్పే పాత్రలు అరుదుగా మాత్రమే వస్తుంటాయని, తనకు వెంటవెంటనే వస్తున్నాయని ఆమె చెప్తోంది.
శ్రుతి
హాసన్
మాట్లాడుతూ....
'''గబ్బర్సింగ్'లోని
భాగ్యలక్ష్మి
పాత్రతో
నేను
తెలుగమ్మాయిని
అయిపోయాను.
ఇక్కడ
అందరూ
సొంత
అమ్మాయిలా
చూసుకుంటున్నారు.
త్వరలో
రాబోతున్న
'రామయ్యా
వస్తావయ్య'లో
అంతకంటే
గొప్ప
పాత్ర
చేశాను.
ఇందులో
నా
పాత్ర
పేరు
'అమ్ములు'.
అచ్చతెనుగు
అమ్మాయి
పాత్ర
అన్నమాట.
'గబ్బర్సింగ్'లో
సెలైంట్గా
కనిపించిన
నేను,
ఇందులో
చలాకీగా
మురిపిస్తా.
ఈ
సందర్భంలో
నేను
థ్యాంక్స్
చెప్పుకోవాల్సింది
హరీష్శంకర్కే.
రెండు
మంచి
పాత్రలిచ్చి
నా
కెరీర్నే
మార్చేశారాయన''
అంది.
'రామయ్యా వస్తావయ్య' చిత్రం అక్టోబర్లో విడుదల కానుంది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. ఇటీవల థమన్ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కు యూట్యూబ్ లో అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.