Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ సరసన శ్రుతి హాసన్ ఎంపిక
హైదరాబాద్: గబ్బర్ సింగ్ తో హిట్ కొట్టిన శ్రుతి హాసన్కి మరో మెగా హీరో ప్రక్కన అవకాసం దక్కినట్లు టాలీవుడ్ సమాచారం. త్వరలో ఈ భామ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాలున్నాయి. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ఆమెను తీసుకున్నట్లు సమాచారం. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా||వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇందులోనే శ్రుతి హీరోయిన్ గా నటించబోతోంది. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందిస్తారు. రేసు గుర్రం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం శ్రుతి హాసన్... 'ఎవడు', 'బలుపు', ఎన్టీఆర్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పూరీ జగన్నాధ్ 'ఇద్దరమ్మాయిలతో' టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు .'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమా టైటిల్ ట్రేడ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎప్పుడూ వెరైటీ టైటిల్స్తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి స్క్ర్రిప్టుని డిఫెరెంట్ గా పూర్తి స్ధాయి వినోదం తో సమకూర్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి 'దేశముదురు' సినిమా చేశారు. అది అర్జున్కు మాస్ ఇమేజ్ను పెంచింది. ఈ చిత్రం గురించి పూరి జగన్నాథ్ తెలియజేస్తూ "ఈ కథ విని బన్ని ఎంతో ఎగ్జయిట్ అయ్యాడు. ఇద్దరమ్మాయిలతో బన్ని చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. మా కాంబినేషన్లో మరో విభిన్న చిత్రంగా ఇది రూపొందనుంది'' అని చెప్పారు.