Don't Miss!
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిజమా? :సీనియర్ హీరోతో శృతిహాసన్
హైదరాబాద్ : ప్రస్తుతం మహేష్ ప్రక్కన హీరోయిన్ గా చేస్తున్న శృతి హాసన్ ...త్వరలో సీనియర్ హీరో వెంకటేష్ ప్రక్కన కనిపించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రీసెంట్ గా శృతిని కలిసి మాట్లాడటం జరిగిందని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమెను ఒప్పించిన దర్శకుడు ఎవరూ అంటారా...ఇంకెవరు దశరథ్ అంటున్నారు. గ్రీకు వీరుడు అంటూ డిజాస్టర్ ఇచ్చిన దశరథ్ ఇప్పుడు మరో చిత్రం వెంకటేష్ తో చేయటానికి సిద్దమవుతున్నారు. అందుకోసమో ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అందుతున్న సమాచారాన్ని బట్టి.... ఇటీవలే దశరథ్ వెంకటేష్ ని కలిసి ఓ కథని చెప్పారు.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. వెంకటేష్ ఫైనల్ కథని ఓకే చేస్తే వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇద్దరూ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన వారే కాబట్టి వీరిద్దరి నుంచి ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఆశించవచ్చు. ఈ సినిమా అధికారిక అనౌన్స్ మెంట్ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
వెంకటేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన ‘గోపాల గోపాల'విడుదల అయ్యి మంచి టాక్ తో రన్ అవుతోంది. వెంకటేశ్, పవన్కల్యాణ్ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల' . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా క్రితం శనివారం (10వ తేదీ) విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది. సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సురేశ్, శరత్మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్కుమార్ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్'కు రీమేక్గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది.
ఈ చిత్రం మొదట యావరేజ్ టాక్ తెచ్చుకుంది కానీ ఇప్పుడు కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డుని క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ వారాంతానికి ఈ చిత్రం 30 కోట్లు దాటిందని చెప్తున్నారు. తొలివారం 30 కోట్లు దాటి సేఫ్ జోన్ లోకి ప్రవేశించిందని, త్వరలో ఇది లాభాల బాట పడుతుందని చెప్తున్నారు. పవన్ ఎఫెక్ట్, పెంచిన పబ్లిసిటీ డోస్,సంక్రాంతి పండగ ప్రభావం భాక్సాఫీస్ వద్ద బాగా వర్కవుట్ అయ్యాయని అంటున్నారు.
చిత్రం కథేమిటంటే...
దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.
దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షాపంత్, నర్రా శీను తదితరులు నటించారు.