Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సూపర్ కాంబో: తెలుగులో మరో మల్టీ స్టారర్.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న సిద్దార్ద్
Recommended Video
సిద్దార్ద్.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. పక్కంటి అబ్బాయిలా ఉండే ఈ హీరో తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. కెరీర్ తొలినాళ్లలో మంచి హిట్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ పలకరించడంతో కనుమరుగైపోయాడు. పదేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేవాడు. ఇప్పుడు ఆ స్థాయిలో సినిమాలను చేయకపోయినా తన మార్క్ చూపించడానికి సన్నద్ధం అవుతున్నాడు. తాజాగా అతడు మరోసారి తెలుగు సినిమాలో నటించబోతున్నాడట.
‘బొమ్మరిల్లు'తో భారీ హిట్
తమిళ సినిమా ‘బాయ్స్'తో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సిద్దార్ధ్. దాని తర్వాత ‘బొమ్మరిల్లు', ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. వీటిలో ‘బొమ్మరిల్లు' ఎఫెక్ట్ టాలీవుడ్పై భారీగానే పడింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ను కొత్తగా చూపించింది.
‘బాద్షా'లో ఎన్టీఆర్ స్నేహితుడిగా..
తెలుగులో హీరోగా సినిమాలు చేసిన సిద్దార్ద్.. జూనియర్ ఎన్టీఆర్ - శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్షా' సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. ఈ సినిమాను మలుపు తిప్పే తారక్ స్నేహితుడి పాత్రను చేశాడు. ఈ సినిమాలో కొద్దిసేపు కనిపించినా చక్కని నటనను కనబరిచాడు.
‘సమ్థింగ్ సమ్థింగ్' తర్వాత బ్రేక్.. ‘గృహం'తో రీఎంట్రీ
సిద్దార్థ్ - హన్సిక కాంబినేషన్లో సుందర్ సీ తెరకెక్కించిన ‘సమ్థింగ్ సమ్థింగ్' సినిమా తర్వాత ఈ హీరో బ్రేక్ తీసుకున్నాడు. అప్పటికి ఎన్నో వరుస ఫ్లాఫ్స్ రావడంతో కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్నాడు. కానీ, ఈ మధ్య ‘గృహం' అనే సినిమాతో రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లేను కూడా అందించాడు ఈ హ్యాండ్సమ్ హీరో.
మల్టీ స్టారర్తో టాలీవుడ్లోకి..
‘RX100' దర్శకుడు అజయ్ భూపతి త్వరలోనే మాస్ మహరాజ రవితేజతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాను మల్టీ స్టారర్గా తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఇందులో రవితేజతో పాటు సిద్ధార్ద్ను కూడా నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు జరుపుతున్నాడని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఇంతకుముందు ప్రచారంలో ఉన్న ‘మహాసముద్రం' అనే స్క్రిప్టుతోనే ఈ సినిమా ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు.
ప్రస్తుతం ఇద్దరూ బిజీగానే..
ప్రస్తుతం మాస్ రాజా రవితేజ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక, సిద్దూ విషయానికొస్తే.. ప్రస్తుతం ‘బిచ్చగాడు' దర్శకుడితో చేసిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.