twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్దార్ధకు బెల్లంకొండ సురేష్ ట్విస్ట్

    By Srikanya
    |

    బెల్లంకొండ సురేష్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరుగా ఎదిగిన సంగతి తెలిసందే. ఆయన తాజాగా నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్దార్ధ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రం నిమిత్తం సిద్దార్ధకు రెమ్యునేషన్ లో కోత విధించి ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. సిద్దార్ద ఇన్నాళ్లూ నాలుగు కోట్లరూపాయలు రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే బెల్లంకొండ సురేష్ మాత్రం హీరోని కూర్చోబెట్టి అతని వరస ప్లాఫ్ లను ప్రస్దావించి కోటి ఇరవై లక్షల రెమ్యునేషన్ కి సెట్ చేసినట్లు తెలుస్తోంది. మొదట ఒప్పుకోకపోయినా బయిట మార్కెట్లోనూ అతన్ని హీరోగా పెట్టుకుని సినిమాలు చేసే వారు లేకపోవటంతో వెంటనే ఓకే చేసారు. కందిరీగ సినిమా టైమ్ లో రామ్ తో రెమ్యునేషన్ విషయంలో వచ్చిన విభేధాలు ఫిలిం ఛాంబర్ వరకూ వెళ్లటంతో బెల్లంకొండ సురేష్ ఈ నిర్ణయం తీసుకుని ముందే సెటిల్ చేసుకున్నట్లు చెప్తున్నారు.

    అయితే ఈ విషయంలో బెల్లంకొండ సురేష్ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. రెమ్యునేషన్ విషయంలో ఖచ్చితంగా ఉండి, అవుట్ పుట్ సరైంది వచ్చేటట్లు చూడటం వల్లే అతను కందిరీగ వంటి హిట్ కొట్టాడని పొగుడుతున్నారు. ఇక ఈ విషయం బయిట స్పెడ్ అయితే సిద్దార్ధ తన రేటు తగ్గించి అందరూ అడుగుతారని బయిటకు పొక్కనీయకూడదని జాగ్రత్తపడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్సో వినపడుతోంది. ఇక సిద్దార్ద నటించిన ఓహ్ మై ప్రెండ్ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. దిల్ రాజు నిర్మింస్తున్న ఆ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. హన్సిక, శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు.

    English summary
    Siddharth has come down a few rungs and settled for Rs 1.25 crore for the film directed by Nandini Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X