Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సిద్ధార్థ్,సమంత చిత్రం టైటిల్ ఖరారు
హైదరాబాద్ : సిద్దార్ధ,సమంత కాంబినేషన్ లో నందినీరెడ్డి దర్సకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డుం డుం పీ పీ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ చిత్రాన్ని బెల్లంకొంండ సురేష్ నిర్మిస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రానికి 'జబర్దస్త్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇక తమిళ వెర్షన్ కు గానూ...ప్రభుసాల్మన్ దర్శకత్వంలో విక్రమ్ ప్రభు హీరోగా కుమ్కి(గజరాజు) చిత్రాన్ని నిర్మించిన తిరుపతి బ్రదర్స్ అధినేతలు దర్శకుడు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, మలేషియా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని మహేష్, ఛాయాగ్రహణను ముత్తుస్వామి అందిస్తున్నారు. చిత్ర ఆడియోను జనవరిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి బేస్ లవ్ స్టోరీనే అయినప్పటికీ...పూర్తిగా ఫన్నీగా సాగేలా దర్శకురాలు స్ర్కిప్టు రెడీ చేసారు. సిద్ధార్థ సినిమాల నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు...నందినీరెడ్డి స్టయిల్లో ఈచిత్రం తెరకెక్కుతోంది. సమంత హీరోయిన్ కావడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్. 2011లోనే ఈచితరం ప్రారంభం అవ్వాల్సి ఉండగా సమంత డేట్స్ సమస్య రావడం, నిర్మాత బెల్లంకొండ సురేష్ కి ఆమెకి మధ్య గొడవ రావడం కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. బెల్లంకొండ ఫిర్యాదుతో వీరి విబేధాలు ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇందులో కలుగ జేసుకోవడంతో చివరకు ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. చివరకు ఫిబ్రవరి 2, 2012న ప్రారంభోత్సవం జరిగింది. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. బెల్లకొండ సురేష్ ఈ చిత్రాన్ని సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకురాలు నందినీ రెడ్డి గతంలో 'అలా మొదలైంది' సినిమాకు దర్శకత్వం వహించారు.