Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలయ్య 'సింహా' ఆడియో పంక్షన్ లేనట్టేనా?
బాలకృష్ణ తాజా చిత్రం 'సింహా' ఆడియోను ఫంక్షన్ జరపకుండా డైరక్ట్ గా మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదట గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామనుకున్నా బాలకృష్ణ ఇన్పెక్షన్ తో కేర్ ఆస్పత్రిలో చేరటం, తగ్గటానికి కొంత కాలం పడుతుందని, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే రిలీజ్ కు కొద్ది రోజులు ముందు ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఉన్న వివరాలు ప్రకారం సింహా చిత్రం ఏప్రియల్ 16న రిలీజ్ కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. బాలకృష్ణ సరసన నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రోమోలు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంతో వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న బాలయ్య తిరిగి పుంజుకుంటారని పరిశ్రమవర్గాలు,అభిమానులు భావిస్తున్నారు.